ETV Bharat / state

ప్రాణాలు అడ్డుపెట్టి మీ ప్రాణాలు కాపాడుతాం: ఎర్రబెల్లి

author img

By

Published : Apr 28, 2021, 1:57 PM IST

Updated : Apr 28, 2021, 2:07 PM IST

వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు సందర్శించారు. పీపీఈ కిట్‌ వేసుకుని కరోనా బాధితులను పరామర్శించారు. ఆస్పత్రిలో 650 ఆక్సిజన్​ బెడ్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 400 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

minister errabelli visits mgm warangal, minister errabelli  latest news
ప్రాణాలు అడ్డుపెట్టి మీ ప్రాణాలు కాపాడుతం: ఎర్రబెల్లి
ప్రాణాలు అడ్డుపెట్టి మీ ప్రాణాలు కాపాడుతాం: ఎర్రబెల్లి

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఆకస్మికంగా సందర్శించారు. పీపీఈ కిట్‌ వేసుకుని కొవిడ్ వార్డును పరిశీలించి బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎంజీఎంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న మంత్రి.. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉన్నాయని.. 800 పడకలు అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఎంజీఎంను పూర్తిస్థాయి కొవిడ్ వైద్య సేవలకు వినియోగిస్తామని తెలిపారు. పరిస్థితి విషమించే వరకు చూడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆసుపత్రిలో 650 ఆక్సిజన్​ బెడ్స్​ ఉన్నాయని, ప్రస్తుతం 400 పెషెంట్లు మాత్రమే ఉన్నారని అన్నారు. రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత గురించి మంత్రి ఈటలతో మాట్లడినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి : వీధి కుక్కలు దాడి.. 25 మూగ జీవాలు మృతి

ప్రాణాలు అడ్డుపెట్టి మీ ప్రాణాలు కాపాడుతాం: ఎర్రబెల్లి

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు ఆకస్మికంగా సందర్శించారు. పీపీఈ కిట్‌ వేసుకుని కొవిడ్ వార్డును పరిశీలించి బాధితులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఎంజీఎంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్న మంత్రి.. ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు సరిపడా ఉన్నాయని.. 800 పడకలు అందుబాటులో ఉంచుతున్నామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ఎంజీఎంను పూర్తిస్థాయి కొవిడ్ వైద్య సేవలకు వినియోగిస్తామని తెలిపారు. పరిస్థితి విషమించే వరకు చూడటం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆసుపత్రిలో 650 ఆక్సిజన్​ బెడ్స్​ ఉన్నాయని, ప్రస్తుతం 400 పెషెంట్లు మాత్రమే ఉన్నారని అన్నారు. రెమ్​డెసివిర్‌ ఇంజక్షన్ల కొరత గురించి మంత్రి ఈటలతో మాట్లడినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి : వీధి కుక్కలు దాడి.. 25 మూగ జీవాలు మృతి

Last Updated : Apr 28, 2021, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.