ETV Bharat / state

కక్షిదారులతో కిక్కిరిసిన కోర్టు పరిసరాలు

author img

By

Published : Dec 14, 2019, 5:10 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కక్షిదారులు రాజీ కోసం ఎక్కువగా రావడం వల్ల కోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

lok adalath
కక్షిదారులతో కిక్కిరిసిన కోర్టు పరిసరాలు

పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం వరంగల్‌ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తిరుమలదేవి ప్రారంభించారు. క్రిమినల్‌, సివిల్‌, భూమి, ఆస్తి తగాదాలాంటి కేసులను పరిష్కరిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ కోసం వచ్చిన వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కారిస్తామని పేర్కొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌కు కక్షిదారులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

కక్షిదారులతో కిక్కిరిసిన కోర్టు పరిసరాలు

ఇవీ చూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'

పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం కోసం వరంగల్‌ అర్బన్ జిల్లా కేంద్రంలో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. హన్మకొండలోని జిల్లా కోర్టులో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తిరుమలదేవి ప్రారంభించారు. క్రిమినల్‌, సివిల్‌, భూమి, ఆస్తి తగాదాలాంటి కేసులను పరిష్కరిస్తున్నామని ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీ కోసం వచ్చిన వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కారిస్తామని పేర్కొన్నారు. జాతీయ లోక్‌ అదాలత్‌కు కక్షిదారులు అధిక సంఖ్యలో తరలిరావడంతో కోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

కక్షిదారులతో కిక్కిరిసిన కోర్టు పరిసరాలు

ఇవీ చూడండి: 'మూసీ సుందరీకరణ కాదు.. శుద్ధీకరణ జరగాలి'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.