ETV Bharat / state

మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన, అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ - Governor tamilisai latest news

Governor protocol controversy రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ ప్రొటోకాల్​ ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశమైంది. వరంగల్​ పర్యటనలో ఉన్న గవర్నర్​కు జిల్లా కలెక్టర్​, పోలీస్​ కమిషనర్​ అధికారిక స్వాగతం పలకకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. తన విషయంలో ప్రొటోకాల్​ పాటించకపోవడం పట్ల గవర్నర్​ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన, అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్
మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన, అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్
author img

By

Published : Aug 25, 2022, 3:34 PM IST

Governor protocol controversy: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వరంగల్​ పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతోన్న 22వ స్నాతకోత్సవంలో గవర్నర్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్​కు జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారిక స్వాగతం పలకకపోవడం తీవ్ర చర్చగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు రాకుండా ఆర్డీవో, డీసీపీ మాత్రమే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నా ప్రొటోకాల్ గురించి మీరు గమనిస్తున్నారు కదా అంటూ గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదగాలనే ఆశ ఉంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని.. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. విద్యార్థులు జీవితాన్ని ఎంజాయ్​ చేస్తూ వ్యక్తిత్వ వికాసం సాధించాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్​ను పెంచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమానికి గవర్నర్​తో పాటు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఇంజినీరింగ్, టెక్నాలజీ పరిశోధన మండలి కార్యదర్శి ఆచార్య సందీప్‌ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 56 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు. వీరితో పాటు 192 మందికి 276 బంగారు పతకాలను గవర్నర్ అందజేశారు. గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు తీసుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఎదగాలనే ఆశ ఉంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. విద్యార్థులు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వ్యక్తిత్వ వికాసం సాధించాలి. కమ్యూనికేషన్​ స్కిల్స్​ను పెంచుకోవాలి.-తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్

Governor protocol controversy: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ వరంగల్​ పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘన మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాకతీయ యూనివర్సిటీలో జరుగుతోన్న 22వ స్నాతకోత్సవంలో గవర్నర్​ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్​కు జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారిక స్వాగతం పలకకపోవడం తీవ్ర చర్చగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు రాకుండా ఆర్డీవో, డీసీపీ మాత్రమే స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నా ప్రొటోకాల్ గురించి మీరు గమనిస్తున్నారు కదా అంటూ గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎదగాలనే ఆశ ఉంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని.. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. విద్యార్థులు జీవితాన్ని ఎంజాయ్​ చేస్తూ వ్యక్తిత్వ వికాసం సాధించాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్​ను పెంచుకోవాలన్నారు.

ఈ కార్యక్రమానికి గవర్నర్​తో పాటు కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం ఇంజినీరింగ్, టెక్నాలజీ పరిశోధన మండలి కార్యదర్శి ఆచార్య సందీప్‌ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 56 మంది విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు. వీరితో పాటు 192 మందికి 276 బంగారు పతకాలను గవర్నర్ అందజేశారు. గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు తీసుకున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఎదగాలనే ఆశ ఉంటే ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. విద్యార్థులు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వ్యక్తిత్వ వికాసం సాధించాలి. కమ్యూనికేషన్​ స్కిల్స్​ను పెంచుకోవాలి.-తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర గవర్నర్

ఇవీ చూడండి..

'గవర్నర్ హుందాగా వ్యవహరిస్తేనే ఆమెకు గౌరవం'

ఎప్పటికి తప్పెను ఈ తిప్పలు, ఆవేదన చెందుతున్న గర్భిణీలు

డీఆర్​డీఓకు కొత్త ఛైర్మన్, సతీశ్ రెడ్డికి కేంద్రంలో కీలక బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.