ETV Bharat / state

ఫాస్టాగ్​ కార్డ్​ ఉన్నా.. టోల్​ కట్టాల్సిందే - టోల్​ సిబ్బంది

హైదరాబాద్​ - వరంగల్​ జాతీయ రహదారిలో రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్​ ప్లాజా వద్ద వాహన చోదకుల నుంచి సిబ్బంది రెండుసార్లు వసూళ్లకు పాల్పడుతున్నారని వాహనదారులు ఆందోళనకు దిగారు.

Extra Toll Fees Charged At Venkatayapalem Toll gate Vehicle owners protest
ఫాస్టాగ్​ కార్డ్​ ఉన్నా.. టోల్​ కట్టాల్సిందే
author img

By

Published : Oct 6, 2020, 11:52 AM IST

హైదరాబాద్​ - వరంగల్​ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్​ ప్లాజా వద్ద సిబ్బంది రెండుసార్లు టోల్​ ఫీజు వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. మామూలుగా వాహనదారుల్లో కొందరు ఫాస్టాగ్​ కార్డు ద్వారా టోల్​ ఫీజు కడుతుంటారు. ఇక్కడ మాత్రం.. ఫాస్టాగ్​ కార్డ్ స్వైప్​ చేసిన తర్వాత కూడా.. కార్డు పని చేయడం లేదంటూ.. డబ్బులు గుంజుతున్నారు. ఫాస్టాగ్​ కార్డులో డబ్బులు చెల్లించినట్టు మొబైల్​కి వచ్చిన మెసేజ్​ చూసుకొని.. వాహనదారులు సిబ్బందిని ఇదేంటని అడగగా.. తెల్ల మొహాలు వేశారు. ఇలా.. ఎంతమంది నుంచి ఒకే వాహనానికి రెండు సార్లు టోల్​ప్లాజా వసూలు చేస్తారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టోల్​ప్లాజా మేనేజర్​ సతీష్​ వాహనదారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని.. రెండుసార్లు చెల్లించిన వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని నచ్చజెప్పారు. సాంకేతిక లోపం వల్ల సమస్య తలెత్తిందని.. మరోసారి ఇలా జరగకుండా సవరిస్తామని సతీష్​ తెలిపారు.

ఇదీ చూడండి:'పండుగల సమయంలో ప్రభుత్వ సూచనలు పాటించండి'

హైదరాబాద్​ - వరంగల్​ జాతీయ రహదారిలోని రఘునాథపల్లి మండలం వెంకటాయపాలెం వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన టోల్​ ప్లాజా వద్ద సిబ్బంది రెండుసార్లు టోల్​ ఫీజు వసూలు చేస్తున్నారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. మామూలుగా వాహనదారుల్లో కొందరు ఫాస్టాగ్​ కార్డు ద్వారా టోల్​ ఫీజు కడుతుంటారు. ఇక్కడ మాత్రం.. ఫాస్టాగ్​ కార్డ్ స్వైప్​ చేసిన తర్వాత కూడా.. కార్డు పని చేయడం లేదంటూ.. డబ్బులు గుంజుతున్నారు. ఫాస్టాగ్​ కార్డులో డబ్బులు చెల్లించినట్టు మొబైల్​కి వచ్చిన మెసేజ్​ చూసుకొని.. వాహనదారులు సిబ్బందిని ఇదేంటని అడగగా.. తెల్ల మొహాలు వేశారు. ఇలా.. ఎంతమంది నుంచి ఒకే వాహనానికి రెండు సార్లు టోల్​ప్లాజా వసూలు చేస్తారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టోల్​ప్లాజా మేనేజర్​ సతీష్​ వాహనదారులను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. బాధితులకు న్యాయం చేస్తామని.. రెండుసార్లు చెల్లించిన వారికి డబ్బులు తిరిగి చెల్లిస్తామని నచ్చజెప్పారు. సాంకేతిక లోపం వల్ల సమస్య తలెత్తిందని.. మరోసారి ఇలా జరగకుండా సవరిస్తామని సతీష్​ తెలిపారు.

ఇదీ చూడండి:'పండుగల సమయంలో ప్రభుత్వ సూచనలు పాటించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.