వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం కూరగాయల మార్కెట్లో ఏర్పాటు చేసిన డిసిన్ఫెక్షన్ టన్నెల్ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ ప్రారంభించారు. ఈ టన్నెల్ను ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. వరంగల్ నగరంలో లాక్డౌన్ పటిష్టంగా కొనసాగుతోంది. అనవసరంగా బయట తిరుగుతున్న వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. సిటిజన్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఎక్కువ సార్లు తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'బయో ఉగ్రదాడికి ట్రైలర్ ఈ కరోనా సంక్షోభం'