ETV Bharat / state

CM KCR: మాంత్రికుడి కథ చెప్పిన ముఖ్యమంత్రి.. వారికి చురకలు - cm kcr funny speech

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో సమీకృత కలెక్టరేట్​ ప్రారంభోత్సవం అనంతరం ప్రసంగించిన కేసీఆర్​.. ఓ మాంత్రికుడి కథ చెప్పి నవ్వులు పూయించారు. ప్రస్తుత కరోనా పరిస్థితిని పోలుస్తూ.. కథ చెప్పారు. కరోనాపై దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ కొన్ని మీడియా సంస్థలకు చురకలు అంటించారు.

cm kcr speech at hanamkonda
cm kcr
author img

By

Published : Jun 21, 2021, 7:51 PM IST

కరోనా మహమ్మారిపై ఉన్నదే చెప్పాలని.. అనవసర దుష్ప్రచారాలు వద్దని.. పలు మీడియా సంస్థలకు హితవు పలికారు సీఎం కేసీఆర్​. భయమే అన్నింటి కన్నా ప్రమాదకమన్నారు. ఈ సందర్భంగా ఓ కథ చెప్పారు..

పూర్వం ఓ రాజ్యాంలో గత్తర్​ (కలరా) వచ్చింది. అనేక మంది చచ్చిపోతాండ్రు. ఏంచేద్దాం రా అంటూ చాలా ప్రయత్నాలు చేశారు. రాజు, అక్కడి వైద్యులు తిప్పలు పడినా.. నానా కష్టాలు పడ్డా.. కమ్మి అయితా లేదు. మరి ఎట్లా... అంటే ఓ మాంత్రికుడు ఉన్నాడు వాడిని తీసుకొస్తే.. గ్యారంటీగా తరిమేస్తాడంటే వాడిని బతిమాలి బామాలి తోలుకొచ్చారు. మాంత్రికుడు.. రాజ్యం పొలిమేర వరకు వచ్చాడు... ఆ మహమ్మారికీ కూడా వాడంటే భయమే.. మాంత్రికుడు రాజ్యంలోనికి వస్తుంటే.. మహమ్మారి బయటకు పోతోంది. ఇద్దరు ఎదురుపడ్డారు. అనవసరంగా ఐదు వందల మందిని చంపితివి కదే.. అని ప్రశ్నించాడు. అన్నా నేనే హిమాందర్​గా చెబుతున్నా.. నేను చంపింది యాభై మందినే.. మిగతా నాలుగు వందల యాభై మంది దగడ్​కే చచ్చిపోయిండ్రు పిచ్చోళ్లు అని మహమ్మారి చెప్పిందంటూ చెప్పిన కేసీఆర్​... అక్కడున్న వారిని కడుపుబ్బా నవ్వించారు.. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని ఈ కథ ద్వారా కేసీఆర్​ వివరించారు.

CM KCR: మాంత్రికుడి కథ చెప్పిన ముఖ్యమంత్రి..

ఇదీచూడండి: KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది

కరోనా మహమ్మారిపై ఉన్నదే చెప్పాలని.. అనవసర దుష్ప్రచారాలు వద్దని.. పలు మీడియా సంస్థలకు హితవు పలికారు సీఎం కేసీఆర్​. భయమే అన్నింటి కన్నా ప్రమాదకమన్నారు. ఈ సందర్భంగా ఓ కథ చెప్పారు..

పూర్వం ఓ రాజ్యాంలో గత్తర్​ (కలరా) వచ్చింది. అనేక మంది చచ్చిపోతాండ్రు. ఏంచేద్దాం రా అంటూ చాలా ప్రయత్నాలు చేశారు. రాజు, అక్కడి వైద్యులు తిప్పలు పడినా.. నానా కష్టాలు పడ్డా.. కమ్మి అయితా లేదు. మరి ఎట్లా... అంటే ఓ మాంత్రికుడు ఉన్నాడు వాడిని తీసుకొస్తే.. గ్యారంటీగా తరిమేస్తాడంటే వాడిని బతిమాలి బామాలి తోలుకొచ్చారు. మాంత్రికుడు.. రాజ్యం పొలిమేర వరకు వచ్చాడు... ఆ మహమ్మారికీ కూడా వాడంటే భయమే.. మాంత్రికుడు రాజ్యంలోనికి వస్తుంటే.. మహమ్మారి బయటకు పోతోంది. ఇద్దరు ఎదురుపడ్డారు. అనవసరంగా ఐదు వందల మందిని చంపితివి కదే.. అని ప్రశ్నించాడు. అన్నా నేనే హిమాందర్​గా చెబుతున్నా.. నేను చంపింది యాభై మందినే.. మిగతా నాలుగు వందల యాభై మంది దగడ్​కే చచ్చిపోయిండ్రు పిచ్చోళ్లు అని మహమ్మారి చెప్పిందంటూ చెప్పిన కేసీఆర్​... అక్కడున్న వారిని కడుపుబ్బా నవ్వించారు.. ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని ఈ కథ ద్వారా కేసీఆర్​ వివరించారు.

CM KCR: మాంత్రికుడి కథ చెప్పిన ముఖ్యమంత్రి..

ఇదీచూడండి: KCR ON CORONA: రెండే రెండు గోళీలు వాడిన... కరోనా ఖతమైంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.