ETV Bharat / state

'ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏం చేశారని సీఎం కేసీఆర్ సహకరించాలి'

author img

By

Published : Apr 8, 2023, 5:08 PM IST

BRS Mahadharna at Bhupalpally : సింగరేణి గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు మహాధర్నా చేపట్టారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఆందోళనల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాఠోడ్‌ పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు కార్మికులతో కలిసి మహాధర్నాను నిర్వహించారు.

BRS Mahadharna
BRS Mahadharna

BRS Mahadharna at Bhupalpally : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఏం చేశారని.. ముఖ్యమంత్రి సహకరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రశ్నించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ధర్నాలో ముఖ్య అతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాఠోడ్‌లు పాల్గొన్నారు. మరికొంత మంది ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ మహా ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేసేందుకే బొగ్గు గనులను వేలం వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బొగ్గు గనులపై ఆధారపడి లక్షల మంది కార్మికులు జీవనం సాగిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ప్రధానినే చెప్పడం అవివేకమని మంత్రి అన్నారు. తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి గుజరాత్‌లో ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ బొగ్గు గనులకు రాని ఆదాయం.. కేవలం సింగరేణికి మాత్రమే వస్తుందన్నారు.

సింగరేణి బొగ్గును కరెంటుకు ఎందుకు వాడటం లేదు: దేశంలో కరెంటును ఉత్పత్తి చేయడానికి విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న బొగ్గును వాడుతున్నారు కానీ దేశీయంగా ఉత్పత్తి అయిన సింగరేణి లాంటి సంస్థల బొగ్గును ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఖర్చు చేసేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఏ విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సహకరించాలని ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రజలంతా మద్దతుగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు భరోసా ఇచ్చారు.

సహజ సంపదను కేంద్రం దోచుకుంటుంది: రాష్ట్రంలోని సహజ సంపదను కేంద్రం దోచుకుంటుందని.. ప్రజల పట్ల కనికరం లేని ప్రధాన మంత్రి ఉండటం దేశం చేసుకున్న దౌర్భాగ్యమని మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. నష్టాలలో ఉన్న సింగరేణిని సీఎం కేసీఆర్‌ లాభాల బాటలోకి తీసుకొచ్చారని.. అలాంటి సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఎద్దేవా చేశారు. అలాగే దేశ సంపదను మోదీ వారి దోస్తులకు దోచి పెడుతున్నారని విమర్శించారు.

మోదీ ఒక్క గుజరాత్‌కు మాత్రమే ప్రధాని కాదని.. దేశం మొత్తానికి ప్రధాని అని గుర్తు చేశారు. ఎప్పుడైతే బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడో.. అప్పటి నుంచి రాజకీయ విలువలకు త్రిలోదకాలు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

BRS Mahadharna at Bhupalpally : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఏం చేశారని.. ముఖ్యమంత్రి సహకరించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మంత్రి సత్యవతి రాఠోడ్ ప్రశ్నించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా ధర్నాలో ముఖ్య అతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాఠోడ్‌లు పాల్గొన్నారు. మరికొంత మంది ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ మహా ధర్నాలో ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. సింగరేణిని ప్రైవేట్‌ పరం చేసేందుకే బొగ్గు గనులను వేలం వేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బొగ్గు గనులపై ఆధారపడి లక్షల మంది కార్మికులు జీవనం సాగిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ప్రధానినే చెప్పడం అవివేకమని మంత్రి అన్నారు. తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి గుజరాత్‌లో ఖర్చు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ బొగ్గు గనులకు రాని ఆదాయం.. కేవలం సింగరేణికి మాత్రమే వస్తుందన్నారు.

సింగరేణి బొగ్గును కరెంటుకు ఎందుకు వాడటం లేదు: దేశంలో కరెంటును ఉత్పత్తి చేయడానికి విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న బొగ్గును వాడుతున్నారు కానీ దేశీయంగా ఉత్పత్తి అయిన సింగరేణి లాంటి సంస్థల బొగ్గును ఎందుకు వాడటం లేదని ప్రశ్నించారు. వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఖర్చు చేసేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఏ విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సహకరించాలని ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రజలంతా మద్దతుగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు భరోసా ఇచ్చారు.

సహజ సంపదను కేంద్రం దోచుకుంటుంది: రాష్ట్రంలోని సహజ సంపదను కేంద్రం దోచుకుంటుందని.. ప్రజల పట్ల కనికరం లేని ప్రధాన మంత్రి ఉండటం దేశం చేసుకున్న దౌర్భాగ్యమని మంత్రి సత్యవతి రాఠోడ్ ఆరోపించారు. నష్టాలలో ఉన్న సింగరేణిని సీఎం కేసీఆర్‌ లాభాల బాటలోకి తీసుకొచ్చారని.. అలాంటి సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఎద్దేవా చేశారు. అలాగే దేశ సంపదను మోదీ వారి దోస్తులకు దోచి పెడుతున్నారని విమర్శించారు.

మోదీ ఒక్క గుజరాత్‌కు మాత్రమే ప్రధాని కాదని.. దేశం మొత్తానికి ప్రధాని అని గుర్తు చేశారు. ఎప్పుడైతే బండి సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడో.. అప్పటి నుంచి రాజకీయ విలువలకు త్రిలోదకాలు ఇచ్చారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.