ETV Bharat / state

జాతీయ పక్షి ప్రాణాలు కాపాడిన గ్రామస్థులు - వరంగల్​ గ్రామీణ జిల్లా సమాచారం

అనారోగ్యంతో ఉన్న ఓ నెమలిని కాపాడి వరంగల్ గ్రామీణ జిల్లా మైలారం గ్రామ ప్రజలు మానవత్వం చాటుకున్నారు. ధాన్యం గింజలు, నీరు అందించి దాని ప్రాణాలను కాపాడారు.

villagers-saved-the-national-bird-lives-in-warangal-rural-district
జాతీయ పక్షి ప్రాణాలు కాపాడిన గ్రామస్థులు
author img

By

Published : Jan 12, 2021, 3:29 PM IST

నిస్సహాయ స్థితిలో ఉన్న జాతీయ పక్షి ప్రాణాలు కాపాడి మూగజీవాలపై తమకు ఉన్న ప్రేమను వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ ప్రజలు ప్రదర్శించారు. అనంతరం పోలీసులకు ఆ నెమలిని అప్పగించారు.

జిల్లాలోని మైలారం గ్రామంలో అనారోగ్యంతో ఎగరలేని స్థితిలో ఉన్న నెమలిని గ్రామస్థులు చూశారు. వెంటనే దాన్ని చేరదీసి ధాన్యం గింజలు, నీరు అందించి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. త్వరితగతిన స్పందించిన ఎస్సై డాక్టర్​ను సంప్రదించి దానికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి అటవీ శాఖ అధికారులకు నెమలిని అప్పగించారు.

నిస్సహాయ స్థితిలో ఉన్న జాతీయ పక్షి ప్రాణాలు కాపాడి మూగజీవాలపై తమకు ఉన్న ప్రేమను వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామ ప్రజలు ప్రదర్శించారు. అనంతరం పోలీసులకు ఆ నెమలిని అప్పగించారు.

జిల్లాలోని మైలారం గ్రామంలో అనారోగ్యంతో ఎగరలేని స్థితిలో ఉన్న నెమలిని గ్రామస్థులు చూశారు. వెంటనే దాన్ని చేరదీసి ధాన్యం గింజలు, నీరు అందించి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్​కు సమాచారం అందించారు. త్వరితగతిన స్పందించిన ఎస్సై డాక్టర్​ను సంప్రదించి దానికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గ్రామస్థులతో కలిసి అటవీ శాఖ అధికారులకు నెమలిని అప్పగించారు.

ఇదీ చదవండి: తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.