ETV Bharat / state

కొనసాగుతున్న అన్నదాతల కష్టాలు..

రాష్ట్రంలో యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకృతి ఓ పక్క... నకలీ విత్తనాలు మరో పక్క... మద్దతు ధర లేక... వేసిన పంటకు ఎరువులు దొరక్క ఇలా ఒక్కోటి అన్నదాతను పీడిస్తున్నాయి. ఈ ఏడాది కాస్త వర్షాలు కురవడం వల్ల కర్షకులు వరి నాట్లు వేశారు. పంటకు ఎరువులు వేయడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి ఓ రైతు మృతి చెందిన ఘటన మరవక ముందే నిజామాబాద్​ జిల్లాలో ఓ మహిళా రైతు యూరియా కోసం నిరీక్షించి సృహ కోల్పోయింది.

author img

By

Published : Sep 7, 2019, 4:37 PM IST

Updated : Sep 7, 2019, 4:45 PM IST

బారులు తీరిన రైతన్నలు
కొనసాగుతున్న అన్నదాతల కష్టాలు..

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎరువుల కొరత రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఒక్కో చేనులో రెండు దఫాలుగా యూరియా వేయాల్సి ఉన్నా కొరతతో సగమే వేస్తున్నారు. పాకాల ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో వరి వేశారు. ఎరువుల కోసం ఖానాపురం వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ఉదయం ఆరు గంటల నుంచే బారులు తీరుతున్నారు.

రెండు బస్తాలు మాత్రమే

ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడం వల్ల యూరియా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దున్నే చంటిపాపలను వదిలిపెట్టి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని మహిళా రైతులు వాపోతున్నారు. ఎంతో దూరం నుంచి వస్తే అప్పటికే బస్తాలు ఉండడం లేదని అన్నదాతలు చెప్పారు. ఎరువులు వేసే సమయం దాటి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​పై ఆశలు గల్లంతు'

కొనసాగుతున్న అన్నదాతల కష్టాలు..

వరంగల్ గ్రామీణ జిల్లాలో ఎరువుల కొరత రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటివరకు ఒక్కో చేనులో రెండు దఫాలుగా యూరియా వేయాల్సి ఉన్నా కొరతతో సగమే వేస్తున్నారు. పాకాల ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో వరి వేశారు. ఎరువుల కోసం ఖానాపురం వ్యవసాయ సహకార సంఘం ముందు రైతులు ఉదయం ఆరు గంటల నుంచే బారులు తీరుతున్నారు.

రెండు బస్తాలు మాత్రమే

ఒక్కో రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తుండడం వల్ల యూరియా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొద్దున్నే చంటిపాపలను వదిలిపెట్టి రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని మహిళా రైతులు వాపోతున్నారు. ఎంతో దూరం నుంచి వస్తే అప్పటికే బస్తాలు ఉండడం లేదని అన్నదాతలు చెప్పారు. ఎరువులు వేసే సమయం దాటి పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చూడండి: 'చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​పై ఆశలు గల్లంతు'

Intro:TG--hyd--VKB--82--31--ZP Chairparson--VO--TS10027

యాంకర్ ...పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని జడ్పీచైర్ పర్సన్ సునీతా రెడ్డి కోరారు. ఆకులం , ఫలాలతో సహజసిద్ధంగా పూజలు చేసినట్లు ప్రకృతి కి కీడం చేయని మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాలని అన్నారు.


Body:1. వాయిస్ ... వికారాబాద్ జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్ పర్సన్ సునీతా రెడ్డి ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పిఓపి తో తయారుచేసిన విగ్రహలను ప్రతిష్టించ వద్దని పిలుపునిచ్చారు. మట్టితో తయారుచేసిన 5వేల విగ్రహాలను ప్రజలకు వితరణ చేశారు. వాటిని తయారు చేసిన కుమ్మరి స్వామి ని సన్మానించారు. గతంలో ఇళ్ళలలో చిత్రపటాలకు పూజలు చేసేవారని ప్రస్తుతం ప్రతి ఇంటిలో విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారని చెప్పారు. వినాయక , బతుకమ్మ పూజలకు వాడే పూలు , పత్రాలు ప్రకృతికి మేలుచేసేవని తెలిపారు. రసాయన విగ్రహాలతో పర్యావరణాన్ని పాడు చేయ్యవద్థని కోరారు.


Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్ , 9985133099
Last Updated : Sep 7, 2019, 4:45 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.