వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం కన్నులపండువగా సాగింది. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామస్థులే పెళ్లిపెద్దలుగా మారి ప్రతి ఏటా అంగరంగా వైభవంగా స్వామి వారికి కల్యాణం నిర్వహిస్తారు.
మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు స్వామి వారి కల్యాణంతో ముగుస్తాయి. ప్రభాబండ్ల ప్రదక్షిణలు.. ముత్తైదువుల కోలహలాల మధ్య జాతర అట్టహాసంగా సాగింది.
ఇదీ చదవండి: ఏకకంఠంతో హరినామ సంకీర్తనలు... ఘనంగా వేడుకలు