వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తోర్రూర్ నుంచి వరంగల్ వైపు వెళుతున్న కారు, వరంగల్ నుంచి తోర్రూర్ వైపు వెళుతున్న కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో హన్మకొండ ప్రాంతానికి చెందిన రాజేష్, రంజిత్, శ్రీకాంత్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: 40 రోజుల్లో 23 లక్షలు సంపాదించాడు... జైలు పాలయ్యాడు