ETV Bharat / state

RTC BUS: రోడ్డుపైకి కాలం చెల్లిన బస్సులు... ఆందోళనలో ప్రయాణికులు

author img

By

Published : Jul 24, 2021, 12:03 PM IST

ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సుల వినియోగం ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. తరచూ బస్సులు చెడిపోవడమే కాకుండా అగ్నిప్రమాదాల బారిన కూడా పడుతున్నాయి. ప్రయాణికులు ప్రాణాలు అరచేత పట్టుకొని బస్సుల్లో వెళ్లాల్సి వస్తోంది. తాజాగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగడం... సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

outdated-rtc-buses-on-the-roads-at-warangal
రోడ్లపైన కాలం చెల్లిన బస్సులు... ఆందోళనలో ప్రయాణికులు

సురక్షిత ప్రయాణానికి నిర్వచనంగా చెప్పుకునే ఆర్టీసీలో ప్రమాదాలు... ప్రయాణికుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ బస్టాండు సమీపంలో... సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణీకులను దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే మూడ్రోజుల క్రితం తొర్రూరుకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు యాదాద్రి జిల్లా కాటేపల్లి వద్ద బస్సు చక్రాలు ఊడి పోయిన ఘటన కూడా జరిగింది. ఈ రెండు ఘటనల్లోనూ డ్రైవర్లు అప్రమత్తం కావడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. రాత్రి పూట ప్రయాణికులంతా నిద్రలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోడానికే భయం వేస్తుంది. కాలం చెల్లిన బస్సులను ఆర్టీసీ నడపడం వల్లే ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

కాలం చెల్లినవే వాడుతున్నారు..

వరంగల్ రీజియన్​లో మొత్తం 968 బస్సులు ఉన్నాయి. ఇందులో 380 బస్సులు అద్దె బస్సులు కాగా... మిగతావి ఆర్టీసీ సొంత బస్సులు. అయితే రెండు నెలల నుంచి అద్దె బస్సులు నడవక పోవడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీకి చెందిన పాత బస్సులనే నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో వందుకు పైగా కాలం చెల్లినవే ఉన్నట్లు సమాచారం. ఇవి దాదాపుగా 13 లక్షల కిలోమీటర్లు తిరిగినా... ఇంకా నడుపుతూనే ఉన్నారు. అందువల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తనిఖీలు చేస్తున్నారా లేదా..?

డిపోల నుంచి బస్సులు బయలుదేరే ముందు మెకానిక్​లు బస్సులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇంజిన్ సామర్థ్యం, ఎలా ఉందన్నదీ క్షుణ్నంగా పరిశీలించాలి. టైర్లతో పాటు బస్సుల్లోని అన్ని విభాగాలను ఒకటికి రెండు సార్లు చూడాలి. డ్రైవర్ సూచించిన సమస్యలను కూడా పరిష్కరించాలి. కానీ అలా చేస్తున్నారా అన్న సందేహాలు ప్రయాణికులకు కలుగుతున్నాయి.

మెకానిక్​ల కొరత ఉంది...

మెకానిక్​ల కొరతతో ఐటీఐ అప్రెంటీస్ విద్యార్థులే బస్సులకు మరమ్మతులు చేస్తున్నారని పలువురు కార్మికులు చెబుతున్నారు. అలాగే టూల్స కిట్రైల కొరత కూడా ఉందని... తప్పనిసరి పరిస్థితుల్లో పరికరాలను స్థానికంగా కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తున్నట్లు వివరించారు. అందువల్లే ఆర్టీసీ బస్సులు తరచూ ఆగిపోవడం, కిటికీలు, టైర్లు వంటివి ఊడిపోవడం జరుగుతోంది. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టేసి... మిగిలిన బస్సులకు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ACCIDENT: అమ్మకు ఆయువు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది..

సురక్షిత ప్రయాణానికి నిర్వచనంగా చెప్పుకునే ఆర్టీసీలో ప్రమాదాలు... ప్రయాణికుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ బస్టాండు సమీపంలో... సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణీకులను దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే మూడ్రోజుల క్రితం తొర్రూరుకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు యాదాద్రి జిల్లా కాటేపల్లి వద్ద బస్సు చక్రాలు ఊడి పోయిన ఘటన కూడా జరిగింది. ఈ రెండు ఘటనల్లోనూ డ్రైవర్లు అప్రమత్తం కావడం వల్ల ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. రాత్రి పూట ప్రయాణికులంతా నిద్రలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోడానికే భయం వేస్తుంది. కాలం చెల్లిన బస్సులను ఆర్టీసీ నడపడం వల్లే ఇలా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

కాలం చెల్లినవే వాడుతున్నారు..

వరంగల్ రీజియన్​లో మొత్తం 968 బస్సులు ఉన్నాయి. ఇందులో 380 బస్సులు అద్దె బస్సులు కాగా... మిగతావి ఆర్టీసీ సొంత బస్సులు. అయితే రెండు నెలల నుంచి అద్దె బస్సులు నడవక పోవడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీకి చెందిన పాత బస్సులనే నడుపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో వందుకు పైగా కాలం చెల్లినవే ఉన్నట్లు సమాచారం. ఇవి దాదాపుగా 13 లక్షల కిలోమీటర్లు తిరిగినా... ఇంకా నడుపుతూనే ఉన్నారు. అందువల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తనిఖీలు చేస్తున్నారా లేదా..?

డిపోల నుంచి బస్సులు బయలుదేరే ముందు మెకానిక్​లు బస్సులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఇంజిన్ సామర్థ్యం, ఎలా ఉందన్నదీ క్షుణ్నంగా పరిశీలించాలి. టైర్లతో పాటు బస్సుల్లోని అన్ని విభాగాలను ఒకటికి రెండు సార్లు చూడాలి. డ్రైవర్ సూచించిన సమస్యలను కూడా పరిష్కరించాలి. కానీ అలా చేస్తున్నారా అన్న సందేహాలు ప్రయాణికులకు కలుగుతున్నాయి.

మెకానిక్​ల కొరత ఉంది...

మెకానిక్​ల కొరతతో ఐటీఐ అప్రెంటీస్ విద్యార్థులే బస్సులకు మరమ్మతులు చేస్తున్నారని పలువురు కార్మికులు చెబుతున్నారు. అలాగే టూల్స కిట్రైల కొరత కూడా ఉందని... తప్పనిసరి పరిస్థితుల్లో పరికరాలను స్థానికంగా కొనుగోలు చేసి మరమ్మతులు చేస్తున్నట్లు వివరించారు. అందువల్లే ఆర్టీసీ బస్సులు తరచూ ఆగిపోవడం, కిటికీలు, టైర్లు వంటివి ఊడిపోవడం జరుగుతోంది. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం స్పందించి కాలం చెల్లిన బస్సులను పక్కన పెట్టేసి... మిగిలిన బస్సులకు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి: ACCIDENT: అమ్మకు ఆయువు తీరింది.. పాపాయికి కన్నీరే మిగిలింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.