ETV Bharat / state

రూ.4.42 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే చల్లా - Challa Dharma reddy news on Construction of roads and sewers

వరంగల్​ రూరల్​ జిల్లా గీసుకొండ మండలం రెండో డివిజన్‌ పరిధిలోని మొగిలిచెర్లతో పాటు గోపాల్‌రెడ్డినగర్‌, పోగుల ఆగయ్యనగర్‌లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. రూ.4.42 కోట్లతో రహదారులతోపాటు మురుగు కాలువల నిర్మాణం పనులను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

mla Challa Dharma reddy told that Construction of roads and sewers will be undertaken at a cost of Rs 4.42 crore
రూ.4.42 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే చల్లా
author img

By

Published : Jan 10, 2021, 11:08 AM IST

కార్పొరేషన్‌లో విలీనమైన మొగిలిచెర్లలో రూ.4.42 కోట్లతో రహదారులతోపాటు మురుగు కాలువల నిర్మాణం పనులను చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. వరంగల్​ రూరల్​ జిల్లా గీసుకొండ మండలం రెండో డివిజన్‌ పరిధిలోని మొగిలిచెర్లతో పాటు గోపాల్‌రెడ్డినగర్‌, పోగుల ఆగయ్యనగర్‌లో కార్పొరేషన్‌ అధికారులతో కలిసి శనివారం పర్యటించారు. రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణాన్ని పరిశీలించారు.

గ్రామంలో ఇప్పటికే రూ.2 కోట్ల నిధులను మంజూరు చేయగా గుత్తేదారులు సక్రమంగా పనులు చేయకపోవడంతో వాటిని రద్దు చేసి తిరిగి టెండర్లను పిలిచి త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు చల్లా చెప్పారు. వాటికి తోడు మరో రూ.2 కోట్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోగుల ఆగయ్యనగర్‌లో 86 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకోగా ఆ భూమి పట్టాదారు మత్యాస్‌రెడ్డితో చరవాణిలో మాట్లాడగా.. పేదల పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించడానికి ఆయన అంగీకరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ బాలయ్య, వరంగల్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ చింతం సదానందం, డీసీసీబీ డైరెక్టర్‌ రమేష్‌, రాజు, కార్పొరేషన్‌ ఏఈ కృష్ణమూర్తి, ఉజ్వల్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు

కార్పొరేషన్‌లో విలీనమైన మొగిలిచెర్లలో రూ.4.42 కోట్లతో రహదారులతోపాటు మురుగు కాలువల నిర్మాణం పనులను చేపట్టనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. వరంగల్​ రూరల్​ జిల్లా గీసుకొండ మండలం రెండో డివిజన్‌ పరిధిలోని మొగిలిచెర్లతో పాటు గోపాల్‌రెడ్డినగర్‌, పోగుల ఆగయ్యనగర్‌లో కార్పొరేషన్‌ అధికారులతో కలిసి శనివారం పర్యటించారు. రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణాన్ని పరిశీలించారు.

గ్రామంలో ఇప్పటికే రూ.2 కోట్ల నిధులను మంజూరు చేయగా గుత్తేదారులు సక్రమంగా పనులు చేయకపోవడంతో వాటిని రద్దు చేసి తిరిగి టెండర్లను పిలిచి త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు చల్లా చెప్పారు. వాటికి తోడు మరో రూ.2 కోట్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోగుల ఆగయ్యనగర్‌లో 86 మంది నిరుపేదలు గుడిసెలు వేసుకోగా ఆ భూమి పట్టాదారు మత్యాస్‌రెడ్డితో చరవాణిలో మాట్లాడగా.. పేదల పేర్ల మీద రిజిస్ట్రేషన్‌ చేయించడానికి ఆయన అంగీకరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ బాలయ్య, వరంగల్‌ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ చింతం సదానందం, డీసీసీబీ డైరెక్టర్‌ రమేష్‌, రాజు, కార్పొరేషన్‌ ఏఈ కృష్ణమూర్తి, ఉజ్వల్‌, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 351 కరోనా కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.