ETV Bharat / state

బలహీనవర్గాల అభివృద్ధికి కృషి: అరూరి రమేశ్​

author img

By

Published : Sep 24, 2020, 12:01 PM IST

సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని బలహీనవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్​ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 82 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.

బలహీనవర్గాల అభివృద్ధికి కృషి: అరూరి రమేశ్​
బలహీనవర్గాల అభివృద్ధికి కృషి: అరూరి రమేశ్​

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 82 మంది లబ్ధిదారులకు 81 లక్షల 10 వేల 396 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావొద్దని సీఎం కేసీఆర్​ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.

రాష్ట్రంలోని బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనాతో దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 82 మంది లబ్ధిదారులకు 81 లక్షల 10 వేల 396 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కావొద్దని సీఎం కేసీఆర్​ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.

రాష్ట్రంలోని బడుగుబలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కరోనాతో దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

ఇదీ చదవండి: మావోలపై డేగకన్ను.. బయటకు పొక్కకుండా జాగ్రత్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.