తమ సొంత భూమిలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఓ రైతు కుటుంబం నిరసనకు దిగింది. ఈ విగ్రహాన్ని ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కుటుంబ సభ్యులతో కలిసి పురుగుమందు డబ్బాలను పట్టుకుని ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని రేలకుంటలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాలిలా...
కూచనబాబు అనే రైతు.. తనకు చెందిన పట్టా భూమిలో కొందరు గ్రామస్థులు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తమకు అంబేడ్కర్పై గౌరవం ఉంది కానీ.. తమ పట్టా భూమిలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని రైతు.. తన కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు.