వనపర్తి మార్కెట్లో వేరుశనగకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధర నమోదైంది. వనపర్తి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు వచ్చే వేరుశనగకు క్వింటాకి గతంలో రూ.3వేల నుంచి రూ.6వేల ధర పలికేది. ఈ ఏడాది గరిష్ఠంగా రూ.7,942 వరకు నమోదవుతోంది.
వనపర్తి మార్కెట్ యార్డ్ చరిత్రలోనే వేరుశనగకు అధిక ధర నమోదు కావడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగకు కేంద్ర ప్రభుత్వం రూ.5,275 మద్దతు ధర ప్రకటించినప్పటికీ... జిల్లా మార్కెట్లో రైతులకు మద్దతు ధర కంటే దాదాపు రూ.3వేల వరకు అధిక ధర లభిస్తోంది.
జిల్లా పరిధిలో పండించిన వేరుశనగకు బహిరంగ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల... ఇక్కడి వ్యాపారులు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పంట విస్తీర్ణం తగ్గినప్పటికీ... విక్రయంలో అధిక ధరలు రావడం వల్ల నష్టం లేదంటున్నారు వ్యవసాయాధికారులు.
ఇతర మార్కెట్లలో ధరల వివరాలు...
- గద్వాల మార్కెట్- క్వింటా రూ.7,285
- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్- క్వింటా రూ.7009
- వరంగల్ మార్కెట్- క్వింటా రూ.7 వేలు