రాష్ట్ర జానపద కళాకారుడైన సాయిచంద్ సోదరుడు, ఆర్మీ జవాన్ క్రాంతికుమార్కు మంత్రి హరీశ్ రావు నివాళులర్పించారు. ఆర్మీలో పనిచేసి నాలుగు సంవత్సరాల క్రితమే రిటైర్ అయినా క్రాంతి కుమార్ అనారోగ్యంతో ఇటీవలే మరణించాడు.
వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో జరిగిన సంతాపసభలో వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. పది రోజుల క్రితం అనారోగ్య కారణాలతో ఆర్మీ జవాన్ క్రాంతి కుమార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.