వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి శంకర సముద్రం భూనిర్వాసితులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేశారు. గతంలో గ్రామానికి 23 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిని రియల్టర్ల చేతి నుంచి తిరిగి గ్రామానికి అప్పగించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం, షిఫ్టింగ్ కు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ భూమి వద్దే టెంట్లు వేసుకుని సామరస్యంగా నిరసన వ్యక్తం చేశారు. కొత్తకోట తహసిల్దార్, ఇతర అధికారులు వచ్చి వారి సమస్యలు తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: నీలోఫర్ ఆస్పత్రిలో "లైట్ అప్ రెడ్" కార్యక్రమం