వికారాబాద్ జిల్లా తాండూరు నాపరాతి పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులకు భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు చేయూతనందించారు. నాపరాతి పరిశ్రమలో పనిచేస్తున్న వలస కార్మికులకు మాస్కులు, భోజనం అందించారు.
బతుకుదెరువు కోసం లాక్డౌన్తో తాండూరులో చిక్కుకుపోయిన వలస కార్మికులను గుర్తించి ఆదుకోవాలని మున్సిపల్ కమిషనర్కు భాజపా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం నర్సింహులు, బాల్ రెడ్డి, మనోహర్ రావు, రమేష్ కుమార్ పాల్గొన్నారు.