వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేట మండలంలో రైతులకు పట్టాపాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. అన్నదాతలకు పాసుబుక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. భూ సమస్యల విషయంలో రైతులకు సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. 30 రోజుల కార్యచరణ ప్రణాళికను నిరంతరం కొనసాగిస్తూ బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేయడం మానుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: చిత్రకళలో ఔరా అనిపించిన అంధులు