ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గంగ్వార్ గ్రామస్థులు డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులే ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు చెప్పినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని రెవెన్యూ అధికారులను నిలదీశారు. బషీరాబాద్లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
కూలీల సాయంతో అభివృద్ధి పనులకు ఇసుకను తరలిస్తే కూలీలకు ఉపాధితో పాటు అభివృద్ధి పనులు జరగడానికి అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇది కాకుండా రాజకీయ పలుకుబడితో ఇసుక తరలిస్తున్నారని... అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఇదీ చదవండి: వైద్యం వికటించి వ్యక్తి మృతి... ఆస్పత్రి ఎదుట ఆందోళన