ETV Bharat / state

పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్​ల కోసం 40కోట్లు విడుదల: సబిత - education minister sabitha indra reddy suggestions to students

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 411 పాఠశాలల్లో సైన్స్​ ల్యాబ్​లు ఏర్పాటుచేసేందుకు రూ. 40 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. బాలికల ఆత్మరక్షణ కోసం 1544 ప్రభుత్వ పాఠశాలల్లో మార్షల్​ ఆర్ట్స్​ శిక్షణ తరగతులు నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని సబిత వెల్లడించారు.

education minister sabitha indra reddy
నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు కావాలి: మంత్రి సబిత
author img

By

Published : Dec 10, 2019, 6:04 PM IST

ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యార్థి కృషిచేయాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా తాండూరులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని సబిత అన్నారు. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు కావాలని ఆమె ఆకాంక్షించారు. సుస్థిర అభివృద్ధి, వ్యవసాయం, పర్యావరణం, రవాణా వ్యవస్థపై తమ ఆలోచనలను ప్రదర్శించాలని విద్యార్థులకు సూచించారు.

సైన్స్​ ల్యాబ్​లకు రూ. 40 కోట్లు..

ప్లాస్టిక్​ వినియోగంతో ఎదురయ్యే పరిణామాలను విద్యార్థులే వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని 411 పాఠశాలల్లో సైన్స్​ ల్యాబ్​లు ఏర్పాటుచేసేందుకు రూ. 40 కోట్లు నిధులు విడుదల చేసినట్లు మంత్రి సబిత వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1544 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్షల్​ ఆర్ట్స్​లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆనంద్​, యాదయ్య, కలెక్టర్​ ఆయేషా, జిల్లా విద్యాధికారి రేణుకదేవి హాజరయ్యారు.

నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు కావాలి: మంత్రి సబిత

ఇవీచూడండి: అయ్యప్ప మాల ధరించాడని ఎండలో నిల్చోబెట్టారు

ప్రపంచానికే భారతదేశం ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రతి విద్యార్థి కృషిచేయాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్​ జిల్లా తాండూరులో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని సబిత అన్నారు. నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు కావాలని ఆమె ఆకాంక్షించారు. సుస్థిర అభివృద్ధి, వ్యవసాయం, పర్యావరణం, రవాణా వ్యవస్థపై తమ ఆలోచనలను ప్రదర్శించాలని విద్యార్థులకు సూచించారు.

సైన్స్​ ల్యాబ్​లకు రూ. 40 కోట్లు..

ప్లాస్టిక్​ వినియోగంతో ఎదురయ్యే పరిణామాలను విద్యార్థులే వారి తల్లిదండ్రులకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని 411 పాఠశాలల్లో సైన్స్​ ల్యాబ్​లు ఏర్పాటుచేసేందుకు రూ. 40 కోట్లు నిధులు విడుదల చేసినట్లు మంత్రి సబిత వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1544 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మార్షల్​ ఆర్ట్స్​లో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆనంద్​, యాదయ్య, కలెక్టర్​ ఆయేషా, జిల్లా విద్యాధికారి రేణుకదేవి హాజరయ్యారు.

నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు కావాలి: మంత్రి సబిత

ఇవీచూడండి: అయ్యప్ప మాల ధరించాడని ఎండలో నిల్చోబెట్టారు

Intro:hyd_tg_tdr_10_siencefair_ab_ts10025_bheemaiah

భారతదేశం ప్రపంచానికి ఆదర్శనగర్ తీర్చిదిద్దడానికి విద్యార్థులు మరింత బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు వికారాబాద్ జిల్లా తాండూరులో సోమవారం జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు ఇదే సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు


Body:విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో ప్రభుత్వం వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహిస్తుందన్నారు నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు గా కావటానికి వైజ్ఞానిక ప్రదర్శనలు వేదికగా నిలుస్తాయి అన్నారు ప్రదర్శనలు సుస్థిర అభివృద్ధి వ్యవసాయం పరిశ్రమల పర్యావరణం పారిశ్రామిక అభివృద్ధి రవాణా వ్యవస్థ పై విద్యార్థులు తమ ఆలోచనలను ప్రదర్శించాలని సూచించారు విద్యార్థులు తల్లిదండ్రులు ఆకాంక్షను నెరవేర్చాలని ఆమె తెలిపారు


Conclusion:ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అపారమైన ప్రతిభ ఉంటుందని ఆమె పేర్కొన్నారు భవిష్యత్తు తరాలకు మంచి గాలి సుధీరు పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఎంతైనా ఉందన్నారు ప్లాస్టిక్ వాడకం పై ఎదురయ్యే పరిణామాలను తల్లిదండ్రులకు వివరించాలని ఆమె సూచించారు ప్రతి విద్యార్థి పుట్టినరోజున ఒక చెట్టు ని తప్పకుండా నాటాలని ఆమె సూచించారు రాష్ట్రస్థాయిలో ప్రతి పాఠశాలకు ఒక సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రంలో 411 పాఠశాలలో 40 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు విద్యార్థుల ఆత్మకు శాంతి కోసం రాష్ట్రంలో 1544 ప్రభుత్వ పాఠశాలల్లో మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తరగతులను ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు విద్యార్థినులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఇచ్చారు దీంతో పాటు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య జిల్లా విద్యాధికారి ని రేణుక దేవి తదితరులు పాల్గొన్నారు

byte.. సబితా ఇంద్రారెడ్డి ఇ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.