ETV Bharat / state

అజాగ్రత్త వహిస్తే... ఆపద కొనితెచ్చుకున్నట్లే..!

author img

By

Published : May 10, 2020, 3:21 PM IST

లాక్​డౌన్​ ఎత్తివేసినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్​ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి సూచించారు. నిబంధనలు సడలించారని అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకు ముప్పు కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరించారు.

vegetables market opening in suryapet by minister jagadish reddy
సూర్యాపేటలో మంత్రి జగదీశ్​ రెడ్డి

కరోనా కేసులతో సంచలనంగా మారిన సూర్యాపేటలో జిల్లా అధికార యంత్రాంగం లాక్​డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నది. ఇక్కడి కూరగాయల మార్కెట్ నుంచి జిల్లా వ్యాప్తంగా కరోనా విస్తరించడం వల్ల జన సమూహంగా ఉండే ప్రాంతాలను విభజించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఒక్క చోట ఉన్న కూరగాయల మార్కెట్​ను మొత్తం 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మార్కెట్లను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా యంత్రాంగం కృషితో కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేశామని అన్నారు. లాక్​డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేసినా.. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసరాలు, కూరగాయలు తెరిచి ఉంచామని తెలిపారు.

లాక్​డౌన్​ ఎత్తివేసినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా కేసులతో సంచలనంగా మారిన సూర్యాపేటలో జిల్లా అధికార యంత్రాంగం లాక్​డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నది. ఇక్కడి కూరగాయల మార్కెట్ నుంచి జిల్లా వ్యాప్తంగా కరోనా విస్తరించడం వల్ల జన సమూహంగా ఉండే ప్రాంతాలను విభజించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఒక్క చోట ఉన్న కూరగాయల మార్కెట్​ను మొత్తం 12 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మార్కెట్లను మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా యంత్రాంగం కృషితో కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో కట్టడి చేశామని అన్నారు. లాక్​డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేసినా.. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసరాలు, కూరగాయలు తెరిచి ఉంచామని తెలిపారు.

లాక్​డౌన్​ ఎత్తివేసినా.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.