ETV Bharat / state

గడపగడపకు సంక్షేమ పథకాలు: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి - గణతంత్ర దినోత్సవాల్లో సూర్యాపేట కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి

అభివృద్ధి పథంలో జిల్లాను ముందుంచెందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్టు సూర్యాపేట జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. అన్ని శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు... గడపగడపకు చేరాలా కృషి చేస్తున్నట్టు తెలిపారు.

suryapeta collector vinaykrishna reddy in republic day celebrations
గడపగడపకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి: కలెక్టర్
author img

By

Published : Jan 26, 2021, 10:47 PM IST

ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకు చేరేలా అహర్నిశలు కృషి చేస్తున్నట్టు సూర్యాపేట కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీ భాస్కరన్​, అదనపు కలెక్టర్ పద్మజ రాణితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందచేశారు. వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాల్స్​ పరిశీలించారు.

జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా ఈ సంవత్సరం యాసంగిలో 2 లక్షల 85 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్టు వెల్లడించారు. రైతు బందు పథకం ద్వారా 2.40 లక్షల మందికి రెండు పంటలకు రూ.608 కోట్లు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించినట్టు తెలిపారు. రూ.5 లక్షల చొప్పున రైతుబీమా ద్వారా 1,502 మంది రైతుల నామినీలకు రూ.75.10 కోట్లు చెల్లించినట్టు వివరించారు. సంక్షేమ పథకాల అమలుతో జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్​డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిర్మయి పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకు చేరేలా అహర్నిశలు కృషి చేస్తున్నట్టు సూర్యాపేట కలెక్టర్ వినయ్​ కృష్ణారెడ్డి తెలిపారు. స్థానిక పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎస్పీ భాస్కరన్​, అదనపు కలెక్టర్ పద్మజ రాణితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందచేశారు. వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాల్స్​ పరిశీలించారు.

జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా ఈ సంవత్సరం యాసంగిలో 2 లక్షల 85 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్టు వెల్లడించారు. రైతు బందు పథకం ద్వారా 2.40 లక్షల మందికి రెండు పంటలకు రూ.608 కోట్లు వ్యవసాయ పెట్టుబడి సహాయం అందించినట్టు తెలిపారు. రూ.5 లక్షల చొప్పున రైతుబీమా ద్వారా 1,502 మంది రైతుల నామినీలకు రూ.75.10 కోట్లు చెల్లించినట్టు వివరించారు. సంక్షేమ పథకాల అమలుతో జిల్లాను ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్​డీఏ పీడీ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిర్మయి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: కర్నల్ సంతోష్​బాబు కుటుంబానికి అరుదైన గౌరవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.