ETV Bharat / state

'పరిసరాల పరిశుభ్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత'

author img

By

Published : Jun 6, 2020, 11:51 AM IST

ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తిరుమలగిరి మున్సిపల్​ ఛైర్​పర్సన్ రజిని రాజశేఖర్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న పారిశుద్ధ్య వారోత్సవాల్లో పాల్గొన్నారు.

sanitation program as a part of urban progress at thirumalagiri municipality
తిరుమలగిరిలో చెత్త బుట్టల పంపిణీ

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించారు. 7, 11 వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పురపాలక ఛైర్​పర్సన్​ రజిని రాజశేఖర్ పరిశీలించారు. అనంతరం తడి, పొడి చెత్త బుట్టలను కాలనీవాసులకు అందజేశారు.

వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రజినీ రాజశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ కె.ఉమేష్ చారి, వైస్ ఛైర్మన్ ఎన్. రఘునందన్ రెడ్డి, కౌన్సిలర్లు వై.నరేష్, సరళ పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించారు. 7, 11 వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పురపాలక ఛైర్​పర్సన్​ రజిని రాజశేఖర్ పరిశీలించారు. అనంతరం తడి, పొడి చెత్త బుట్టలను కాలనీవాసులకు అందజేశారు.

వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రజినీ రాజశేఖర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ కమిషనర్ కె.ఉమేష్ చారి, వైస్ ఛైర్మన్ ఎన్. రఘునందన్ రెడ్డి, కౌన్సిలర్లు వై.నరేష్, సరళ పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.