ETV Bharat / state

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తిరుమలగిరి మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అర్వపల్లి, బొల్లంపల్లి గ్రామాల్లో వైకుంఠధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

author img

By

Published : May 7, 2021, 5:28 PM IST

mla gadari kishore, thungathurti, suryapet
mla gadari kishore, thungathurti, suryapet

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని అభివృద్ధి పనులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ గురువారం ప్రారంభించారు.

★ తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు నూతన వస్త్రాలు అందజేశారు.

★ జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో రూ.12.6 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు.

★ అనంతరం జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలో శ్మశానవాటికను ప్రారంభించారు. కాసర్లపహాడ్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, మార్కెట్ ఛైర్మన్ మూల అశోక్ రెడ్డి, జడ్పీటీసీ దుపాటి అంజలీ రవీందర్, పీఏసీఎస్​ ఛైర్మన్ పాలెపు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లోని అభివృద్ధి పనులను తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ గురువారం ప్రారంభించారు.

★ తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రజాపరిషత్ కార్యాలయంలో 30 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు నూతన వస్త్రాలు అందజేశారు.

★ జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో రూ.12.6 లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు.

★ అనంతరం జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లి గ్రామంలో శ్మశానవాటికను ప్రారంభించారు. కాసర్లపహాడ్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమరుగొమ్ముల స్నేహలత, మార్కెట్ ఛైర్మన్ మూల అశోక్ రెడ్డి, జడ్పీటీసీ దుపాటి అంజలీ రవీందర్, పీఏసీఎస్​ ఛైర్మన్ పాలెపు చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.