ETV Bharat / state

కరోనా కట్టడి కోసం సీఎం నిరంతరం సమీక్షిస్తున్నారు: మంత్రి జగదీశ్

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. కరోనా సోకిన వారు విధిగా ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. హుజూర్​నగర్ నియోజకవర్గంలో కొవిడ్ పరిస్థితులపై ఆయన సమీక్షించారు.

author img

By

Published : May 18, 2021, 11:02 AM IST

minister jagadeeswar reddy review
మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమీక్ష, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ అధ్యక్షతన టాస్క్​ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కరోనా అనుమానితులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలు, 184 గ్రామ పంచాయతీల్లో 85,531 ఇళ్లలో సర్వే నిర్వహించగా... 3,289 మందికి పాజిటివ్​గా తేలిందని తెలిపారు. వారిలో 2,486 మందికి మెడికల్ కిట్లు అందజేశామన్నారు. కొవిడ్ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో మంత్రి పాల్గొన్నారు.

కరోనా సోకిన వారు విధిగా ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. హుజూర్​నగర్, కోదాడలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలతో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 200 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. బాధితులకు ఉచిత భోజన సౌకర్య కల్పించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్​వో కోట చలం, డిప్యూటీ డీఎంహెచ్​వో హర్షవర్ధన్, డీసీహెచ్ వెంకటేశ్వర్లు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణ్ కుమార్​తో పాటు జడ్పీటీసీ సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, స్థానిక ఆర్డీవో వెంకారెడ్డి, ఎంఆర్వో జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ అధ్యక్షతన టాస్క్​ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కరోనా అనుమానితులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గ పరిధిలోని 7 మండలాలు, 184 గ్రామ పంచాయతీల్లో 85,531 ఇళ్లలో సర్వే నిర్వహించగా... 3,289 మందికి పాజిటివ్​గా తేలిందని తెలిపారు. వారిలో 2,486 మందికి మెడికల్ కిట్లు అందజేశామన్నారు. కొవిడ్ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో మంత్రి పాల్గొన్నారు.

కరోనా సోకిన వారు విధిగా ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. హుజూర్​నగర్, కోదాడలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాలతో పాటు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 200 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని వినియోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. బాధితులకు ఉచిత భోజన సౌకర్య కల్పించినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్​వో కోట చలం, డిప్యూటీ డీఎంహెచ్​వో హర్షవర్ధన్, డీసీహెచ్ వెంకటేశ్వర్లు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కరుణ్ కుమార్​తో పాటు జడ్పీటీసీ సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, స్థానిక ఆర్డీవో వెంకారెడ్డి, ఎంఆర్వో జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు పోగొట్టుకోవద్దు: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.