ETV Bharat / state

VIDEO VIRAL : జాతీయ జెండాకు అవమానం - తలకిందులుగా ఆవిష్కరణ - NATIONAL FLAG HOISTED UPSIDE DOWN

జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేసిన నేతలు - గమనించి సరిచేసిన డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి - నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 101 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఆవిష్కరణ

National Flag Displayed Upside Down in Medchal District
National Flag Displayed Upside Down in Medchal District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 4:41 PM IST

National Flag Displayed Upside Down in Medchal District : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ ఘటన మేడ్చల్​లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, మేడ్చల్ మున్సిపాలిటీ వివేకానంద విగ్రహం పార్క్ వద్ద ఛైర్​పర్సన్ దీపికా రెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేశారు.

ఈ వేడుకల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. నాయకులు జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి తలకిందులుగా ఉన్న జెండాను గమనించి సరిచేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయినప్పటికీ జెండాకు అవమానం జరిగిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హరివర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు హాజరయ్యారు.

జాతీయ జెండాకు అవమానం - తలకిందులుగా ఆవిష్కరణ (ETV Bharat)

101 అడుగుల ఎత్తులో జాతీయ పతాకావిష్కరణ : ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 101 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శ్రీ ఏక చక్ర సేవా సమితి ఆధ్వర్యంలో పతాకాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బోధన్ పట్టణంలో జెండా ఏర్పాటుకు కృషి చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

దావోస్ ఒప్పందాలతో రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది : గవర్నర్

National Flag Displayed Upside Down in Medchal District : గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ ఘటన మేడ్చల్​లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, మేడ్చల్ మున్సిపాలిటీ వివేకానంద విగ్రహం పార్క్ వద్ద ఛైర్​పర్సన్ దీపికా రెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేశారు.

ఈ వేడుకల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. నాయకులు జాతీయ జెండాను తలకిందులుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి తలకిందులుగా ఉన్న జెండాను గమనించి సరిచేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అయినప్పటికీ జెండాకు అవమానం జరిగిందని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హరివర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు హాజరయ్యారు.

జాతీయ జెండాకు అవమానం - తలకిందులుగా ఆవిష్కరణ (ETV Bharat)

101 అడుగుల ఎత్తులో జాతీయ పతాకావిష్కరణ : ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో 101 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శ్రీ ఏక చక్ర సేవా సమితి ఆధ్వర్యంలో పతాకాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బోధన్ పట్టణంలో జెండా ఏర్పాటుకు కృషి చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

రామోజీ ఫిల్మ్​సిటీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

దావోస్ ఒప్పందాలతో రాష్ట్రం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది : గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.