ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యయత్నం

తన పేరు మీద ఉన్న భూమిని కొత్త రికార్డుల్లో నమోదు చేయాలని ఎమ్మార్వోను వేడుకున్నాడు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

రైతు ఆత్మహత్యయత్నం
author img

By

Published : Jul 2, 2019, 6:32 PM IST


కార్యాలయాల చుట్టూ.. కాళ్లరిగేలా తిరిగినా.. తన పనికావడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్​లో చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన రైతు కళ్లెం చెర్ల నాగయ్యకు 48వ సర్వేనెంబర్​లో ఒక ఎకరం 8 గుంటల భూమి పాత రికార్డులో ఉంది. ఇటీవల నిర్వహించిన భూ ప్రక్షాళనలో కేవలం 21 గుంటల భూమి మాత్రమే సాగులో ఉన్నట్లు గుర్తించారు. పాత రికార్డులో తనకు ఉన్న ఎకరం 8 గుంటల భూమిని కొత్త రికార్డులో చేర్చాలని సదరు రైతు మొరపెట్టుకున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ..ఎమ్మార్వో మాత్రం రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనస్తాపం చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

రైతు ఆత్మహత్యయత్నం

ఇవీ చూడండి: ప్రియురాలికి చావు పరీక్ష పెట్టిన కిరాతకుడు


కార్యాలయాల చుట్టూ.. కాళ్లరిగేలా తిరిగినా.. తన పనికావడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్​లో చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన రైతు కళ్లెం చెర్ల నాగయ్యకు 48వ సర్వేనెంబర్​లో ఒక ఎకరం 8 గుంటల భూమి పాత రికార్డులో ఉంది. ఇటీవల నిర్వహించిన భూ ప్రక్షాళనలో కేవలం 21 గుంటల భూమి మాత్రమే సాగులో ఉన్నట్లు గుర్తించారు. పాత రికార్డులో తనకు ఉన్న ఎకరం 8 గుంటల భూమిని కొత్త రికార్డులో చేర్చాలని సదరు రైతు మొరపెట్టుకున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ..ఎమ్మార్వో మాత్రం రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనస్తాపం చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

రైతు ఆత్మహత్యయత్నం

ఇవీ చూడండి: ప్రియురాలికి చావు పరీక్ష పెట్టిన కిరాతకుడు

Intro:Slug :. TG_NLG_22_01_SUCIDE_ATTEM_IN_MRO_OFFICE_AB_C1

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య, ఈటీవీ, కం, సుర్యాపేట

( ) తన పేరు మీద ఉన్న భూమిని కొత్త రికార్డుల్లో నమోదు చేయాలని కొన్ని నెలలుగా రెవిన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా... పట్టించుకోవడం లేదంటూ పెన్ పహాడ్ మండల తహాసిల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. పురుగుమందు సేవిస్తుండగా గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకుని ఆసుపత్రికి తరలించారు.

వాయిస్ ఓవర్ :

పెన్ పహాడ్ మండలం ఎన్ అన్నారం కు చెందిన కళ్లెం చెర్ల నాగయ్య అనే రైతుకు అదే గ్రామాల్లోని 48 వ సర్వేనెంబర్ లో ఒక ఎకరం 8 గుంటల భూమి పాత రికార్డులో ఉంది. దీనికి పట్టా కూడా ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన భూ ప్రక్షాళనలో కేవలం 21 గుంటల భూమి మాత్రమే సాగులో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన భూమి లో కొంత రహదారి , మరికొంత సాగర్ డిస్ట్రీబ్యూటరీ కాలువ వెళ్లినట్లు భూ ప్రక్షాళన లోతేల్చారు. పాత రికార్డులో తనకు ఉన్న ఎకరం 8 గంటల భూమిని కొత్త రికార్డులో చేర్చాలని సదరు రైతు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు 21 గుంటల భూమి సాగులో ఉన్న విషయాన్నే రికార్డులో నమోదు చేశామని తేల్చి చెప్పారు. అధికారులు చెపుతున్న విషయాన్ని విభేదిస్తున్న బాధిత రైతు నాగయ్య తన భూమిని బాటలో , కాలువలోకి ఎలా చేర్చుతారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నాడు. ఇదే క్రమంలో ఈరోజు ఎమ్మార్వో ను కలిసి సమస్యను పరిష్కరించాలని విన్నవించుకున్నాడు. దీనికి స్థానిక ఎమ్మార్వో ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాయింట్ కలెక్టర్ కు ఎందుకు ఫిర్యాదు చేశావని మందలిస్తూ.. విధులకు ఆటంకం కల్పిస్తున్నావని కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడినట్లు రైతు చెపుతున్నాడు. ఒకవైపు భూమి రికార్డుల్లో నమోదు గాక మరోవైపు అధికారుల నుంచి మందలింపులు ఎదురవ్వడంతో మనస్తాపం చెందిన రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించి కాపాడారు. మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు ...బైట్

1. నాగయ్య , బాధిత రైతు


Body:...


Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.