ETV Bharat / state

అరుదైన వ్యాధి కబళిస్తోంది... ఆ అమ్మ హృదయం అర్థిస్తోంది! - mohan baba waiting for donners help

పిల్లలకు చిన్న జ్వరమొస్తేనే విలవిల్లాడిపోతాం.. అలాంటిది కళ్లెదుటే తమ బిడ్డ నరకయాతన పడుతుంటే కన్నపేగు తల్లడిల్లిపోతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడి ఆరోగ్యం... రోజురోజుకు క్షీణించిపోతుంటే ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణణాతీతం. బిడ్డను కాపాడుకునేందుకు ఉన్నదంతా ఖర్చు చేశారు. చేతిలో చిల్లి గవ్వలేక... అరుదైన వ్యాధితో బతుకు పోరాటం చేస్తున్న బిడ్డను కాపాడుకోవడానికి దాతల సాయంకోసం ఎదురు చూస్తున్నారు.

A boy with a rare disease
అరుదైన వ్యాధితో బిడ్డ నరకయాతన
author img

By

Published : Feb 2, 2020, 7:57 PM IST

Updated : Feb 2, 2020, 9:13 PM IST

అరుదైన వ్యాధి.. ఓబిడ్డ నరకయాతన

ఆడుతూ పాడుతూ ఉండాల్సిన తనయుడు అరుదైన వ్యాధితో... నరకయాతన పడుతుంటే... ఏంచేయాలో పాలుపోక రోధిస్తున్నారు తల్లిదండ్రులు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ రఫీ, బేగంల కుమారుడు మహమ్మద్ మోహిన్ బాబా... ఎనిమిదో తరగతిలో అరుదైన వ్యాధితో మంచానికి పరిమితమయ్యాడు.

ఉన్నదంతా ఊడ్చి

ఆర్​ఎంపీగా పనిచేస్తున్న రఫీ... కుమారుడిని బాగు చేసుకోడానికి ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించాడు. హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రి వైద్యులు... బాబాకు అరుదుగా వచ్చే వైరల్​ ఇన్​ సపోలిటీఎస్​ అనే మెదడు నరానికి సంబంధించిన వ్యాధి వచ్చినట్లు తేల్చారు. కొడుకును దక్కించుకోవడానికి సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశాడు. అక్కడ తగ్గక పోయేసరికి కేరళలోని ఆయుర్వేద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తమ కుమారుడి ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశ కలిగిందని బాబా తండ్రి తెలిపారు. ఆర్థిక స్థోమత లేక వైద్యానికి ఇబ్బందవుతోందని... దాతలు స్పందించి... తన కుమారుడిని బతికించమంటూ ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

దాతలు స్పందించండి

వారి కష్టాలను చూసిన స్థానికులు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి బాలుడి వైద్యానికి ముందుకు రావాలని కోరుతున్నారు. వేడుకలకు, సంబురాలకు ఎంతో ఖర్చు చేస్తాం... పెద్ద మనసుతో ఈ బాలుడికి చేసే సాయం ఓ ప్రాణాన్ని నిలబెట్టడమే కాదు... ఓ కుటుంబానికి ఊపిరి పోస్తుంది.

ఇదీ చూడండి: వనదేవతల జాతరలో కోయదొరల జోరు

అరుదైన వ్యాధి.. ఓబిడ్డ నరకయాతన

ఆడుతూ పాడుతూ ఉండాల్సిన తనయుడు అరుదైన వ్యాధితో... నరకయాతన పడుతుంటే... ఏంచేయాలో పాలుపోక రోధిస్తున్నారు తల్లిదండ్రులు. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌కు చెందిన మహమ్మద్ రఫీ, బేగంల కుమారుడు మహమ్మద్ మోహిన్ బాబా... ఎనిమిదో తరగతిలో అరుదైన వ్యాధితో మంచానికి పరిమితమయ్యాడు.

ఉన్నదంతా ఊడ్చి

ఆర్​ఎంపీగా పనిచేస్తున్న రఫీ... కుమారుడిని బాగు చేసుకోడానికి ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించాడు. హైదరాబాద్​లోని యశోద ఆస్పత్రి వైద్యులు... బాబాకు అరుదుగా వచ్చే వైరల్​ ఇన్​ సపోలిటీఎస్​ అనే మెదడు నరానికి సంబంధించిన వ్యాధి వచ్చినట్లు తేల్చారు. కొడుకును దక్కించుకోవడానికి సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశాడు. అక్కడ తగ్గక పోయేసరికి కేరళలోని ఆయుర్వేద ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తమ కుమారుడి ఆరోగ్యం మెరుగవుతుందన్న ఆశ కలిగిందని బాబా తండ్రి తెలిపారు. ఆర్థిక స్థోమత లేక వైద్యానికి ఇబ్బందవుతోందని... దాతలు స్పందించి... తన కుమారుడిని బతికించమంటూ ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

దాతలు స్పందించండి

వారి కష్టాలను చూసిన స్థానికులు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి బాలుడి వైద్యానికి ముందుకు రావాలని కోరుతున్నారు. వేడుకలకు, సంబురాలకు ఎంతో ఖర్చు చేస్తాం... పెద్ద మనసుతో ఈ బాలుడికి చేసే సాయం ఓ ప్రాణాన్ని నిలబెట్టడమే కాదు... ఓ కుటుంబానికి ఊపిరి పోస్తుంది.

ఇదీ చూడండి: వనదేవతల జాతరలో కోయదొరల జోరు

Intro:యాంకర్ వాయిస్...సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణమును చెందిన మహమ్మద్ రఫీ బెగంల తనయుడు మహమ్మద్ మోహిన్ బాబా .వీరిది చాలా పేద కుటుంబం.ఇతను Rmp డాక్టర్ గా పనిచేస్తున్నాడు.బాబాకు8 వ తరగతి చదువుతున్న ప్పుడు బాబాకు జ్వరం ఉందని ఉపాధ్యాయులు బాబాను ఇంటికి పంపించారు.వెంటనే రఫీ ప్రాథమిక చికిత్స చేసినా జ్వరం తగ్గలేదు.కొన్ని గంటల లో బాబా తీవ్ర అనారోగ్యానికి గురైనాడు.

వాయిస్ ఓవర్....మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలివచ్చారు. అక్కడ వైద్యులు బాబాను పరిశీలించి హైదరాబాద్ తీసుకుని వెళ్లాలని సూచించారు. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తీసుకొని వెళ్లినారు. అక్కడ వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించి అత్యవసర నిమిత్తం ఎంటెన్సివ్ కేర్ యూనిటకు పంపించారు.బాబాకు అరుదుగా వచ్చే వైరల్ ఇన్ సపోలిటీఎస్ అనే మెదడు ప్రధాన నరానికి సంబంధించిన జబ్బు వొచ్చిందని యశోద డాక్టర్లు తెలిపారు. వ్యాధి నయం కావడానికి లక్షల రూపాయల ఖర్చు అవుతుందని తెలిపారు.ఒక వైపు ఆర్థిక స్తోమత లేక మరోవైపు కన్న కొడుకును దక్కించుకోవాలని తాపత్రయం తొ ఏమాత్రం వెనుకాడకుండా యశోద వైద్యుల షరతులు ఒప్పుకున్నారు.సుమారు 15 లక్షలు ఖర్చు చేసినారు.అయినా ఫలితం లేకుండా పోయింది.తన స్వంత ఇంటిని అమ్ముకొని,అంతేకాక అవకాశం ఉన్న చోట అప్పులు చేసి చికిత్స కు ఖర్చు చేసాడు.బాబాను వైద్య నిమిత్తం కేరళలో ఆయుర్వేద హాస్పిటల్ కి తీసుకొని వెళ్లినారు.అక్కడ 10 లక్షలు ఇప్పటి వరకు ఖర్చు చేసినట్లుగా తల్లిదండ్రులు తెలిపారు.కేరళలో కొద్దిగా కదిలికలు కనిపిoచినట్లు తెలిపారు.చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మా బాబాను కాపాడాలని వేడుకున్నారు
బైట్... మహమ్మద్ రఫీ
మహమ్మద్ మసీదుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్ నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346
Last Updated : Feb 2, 2020, 9:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.