ETV Bharat / state

పొలానికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు చేరాడు.!

పొలంలో ప్రమాదవశాత్తు కాలు జారీ బురదలో పడి ముఖం ఇరుక్కుపోయి ఊపిరాడక ఓ యువరైతు మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దీపాయంపల్లిలో చోటుచేసుకుంది.

author img

By

Published : Jul 10, 2020, 7:49 PM IST

Went to the farm but did not return young farmer at siddipet
పొలానికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకు చేరాడు

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లికి చెందిన ఓ యువరైతు పొలం దున్నడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. కనకరాజు(29)వరి నాటు కోసం పొలానికి వెళ్లి చదునుచేస్తున్న క్రమంలో కాలుజారీ పడిపోయాడు. ఈ క్రమంలో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు.

యువరైతు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర కిసాన్​ మెర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి యువ రైతు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన వంతు సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు.

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లికి చెందిన ఓ యువరైతు పొలం దున్నడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించాడు. కనకరాజు(29)వరి నాటు కోసం పొలానికి వెళ్లి చదునుచేస్తున్న క్రమంలో కాలుజారీ పడిపోయాడు. ఈ క్రమంలో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు.

యువరైతు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న భాజపా రాష్ట్ర కిసాన్​ మెర్చా ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెడ్డి యువ రైతు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తన వంతు సాయంగా రూ.5 వేల ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు.

ఇదీ చూడండి : వాస్తు పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారు : రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.