సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు రహదారిపైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనుల కొరకు మట్టి తీసుకురావడానికి వెళ్తున్న ఓ టిప్పర్ అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఘటనలో డ్రైవర్ బబులేంధర్ సురక్షితంగా బయటపడ్డాడు.
ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళుతూ ఉండడం వల్ల.. వెనకాల వస్తున్న టిప్పర్కు దారి ఇచ్చే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఇవీచూడండి: గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్