ETV Bharat / state

'పాస్​ అవ్వడం కోసం కాదు  ఉన్నతంగా ఎదిగేందుకు చదవాలి'

పరీక్షల సమయంలో విద్యార్థులు టీవీ, సెల్​ఫోన్లు దూరం పెట్టి చదువు మీద శ్రద్ధ పెట్టాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.

author img

By

Published : Dec 20, 2019, 9:35 AM IST

telangana state finance minister harish rao visit to bajjanki
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్​ రావు బెజ్జంకి పర్యటన
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్​ రావు బెజ్జంకి పర్యటన

విద్యార్థులు కేవలం పాస్​ అవ్వడం కోసం కాదు.. ఉన్నత స్థాయికి ఎదగాలనే కాంక్షతో చదవాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో పర్యటించిన హరీశ్​.. ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.

విద్యార్థులు కళాశాలకు రాకపోతే తల్లిదండ్రులకు ఫోన్​ చేయాలని వందశాతం హాజరు ఉండేలా చూసుకోవాలని అధ్యాపకులను మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్​ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యార్థులకు ఎలాంటి అవసరాలున్నా... తన దృష్టికి తీసుకురావాలని అధ్యాపకులను హరీశ్​ కోరారు. ఈ ఏడాది కచ్చితంగా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్​ రావు బెజ్జంకి పర్యటన

విద్యార్థులు కేవలం పాస్​ అవ్వడం కోసం కాదు.. ఉన్నత స్థాయికి ఎదగాలనే కాంక్షతో చదవాలని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో పర్యటించిన హరీశ్​.. ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు.

విద్యార్థులు కళాశాలకు రాకపోతే తల్లిదండ్రులకు ఫోన్​ చేయాలని వందశాతం హాజరు ఉండేలా చూసుకోవాలని అధ్యాపకులను మంత్రి ఆదేశించారు. మధ్యాహ్న భోజనంతో పాటు సాయంత్రం స్నాక్స్​ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

విద్యార్థులకు ఎలాంటి అవసరాలున్నా... తన దృష్టికి తీసుకురావాలని అధ్యాపకులను హరీశ్​ కోరారు. ఈ ఏడాది కచ్చితంగా వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు.

Intro:TG_SRD_71_19_HARISH PARYATANA_SCRIPT_TS10058


యాంకర్: విద్యార్థులు పరీక్ష సమయం టీవీలు సెల్ ఫోన్స్ దూరం పెట్టండి సోషల్ మీడియాకు దూరంగా ఉండండి కళాశాలలో అధ్యాపకులకు 100% ఫలితాలు దేవాలయం 100% రిజల్ట్ రాకపోతే కళాశాలకు నిధులు కట్ హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం హరీష్ రావు పర్యటించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన హరీష్ రావు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ ఎంపీపీ జడ్పిటిసి కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. బెజ్జంకి మండల టిఆర్ఎస్ నాయకులు అభిమానులు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఘనస్వాగతం పలికారు పూలవర్షం కురిపించారు. అనంతరం వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు.


Body: ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...... ఈ ఏడాది ఇంటర్ లో వందకు వందశాతం ఫలితాలు ఉంటాయని ఇంటర్ విద్యార్థిని విద్యార్థులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అసలు పాస్ అవడం కోసం చదవడం ఏంటని ఉన్నంత స్థాయికి ఎదగాలంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలి విజ్ఞానాన్ని పొందాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాలలో ఎకనామిక్స్ కామర్స్ ఫిజిక్స్ సబ్జెక్టుకు గత ఏడాది ఎక్కువ మార్కులు వచ్చాయి. అని ఈసారి సబ్జెక్టులలో విద్యార్థులు వందకు వందశాతం పాస్ కావాలని లెక్చరర్లకు హరీష్ రావు కోరారు.


Conclusion: విద్యార్థులు కాలేజీ కి రాకపోతే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని 100% వచ్చే ఈ విధంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సాయంత్రం స్నాక్స్ కూడా ఏర్పాటు చేశామని విద్యార్థులకు ఎలాంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని లెక్చరర్లకు హరీష్ రావు చెప్పారు. ఈ సంవత్సరం కచ్చితంగా 100% ఉత్తీర్ణత సాధించాలని ఆవిధంగా విద్యార్థులకు పాఠాలు చెప్పాలన్నారు.

బైట్: ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.