సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో భాషంపల్లి వీరస్వామి అనే వ్యక్తి అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. గతంలో ఓసారి వీరస్వామి పిల్లలు, గ్రామస్థులపై దాడిచేస్తూ పిచ్చివాడిలా వ్యవహిరించగా వైద్యులు ఎర్రగడ్డ ఆసుపత్రికి సిఫార్సు చేశారు. కానీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా అతను సమాధానాలన్నీ కరెక్ట్గా చెప్పడం వల్ల అతనికి పిచ్చిలేదని కోర్టు తీర్మానించి విడుదల చేసింది.
మూడు నెలలైనా కాకముందే మళ్లీ నిన్న రాత్రి కాచవేని సమ్మయ్య అనే వ్యక్తి పై వీరస్వామి కర్రతో దాడి చేసి గాయపర్చాడు. గ్రామస్థులు సైకో వీరస్వామికి దేహశుద్ధి చేసి బంధించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది