ఉద్యోగ అవకాశాలొస్తాయని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే.. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం ఆధ్వర్యంలో సిద్దిపేట పొన్నాల రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీతోపాటు నిరుద్యోగ భృతీ చెల్లించాలని డిమాండ్ చేశారు. రహదారిపై బైఠాయించిన బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
ఇదీ చూడండి: "కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల