ETV Bharat / state

దుబ్బాక నియోజకవర్గంలో తెరాస నేతల ఇళ్లలో పోలీసుల సోదాలు

author img

By

Published : Oct 31, 2020, 10:44 AM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తెరాస నేతల ఇళ్లలో పోలీసులు సోదా నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

police raid on TRS leaders homes in dubbaka
దుబ్బాక నియోజకవర్గంలో పోలీసుల సోదాలు

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో తెరాస నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఎనిమిది మంది నేతల ఇళ్లలో తనిఖీలు చేశారు. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ పుష్పలత కిషన్​రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండి శ్రీలేఖ రాజు, ఆర్యవైస్య సమాజ అధ్యక్షుడు చింత రాజు, సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సూడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో ఏం దొరకలేదని వెనుతిరిగినట్లు చెప్పారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో తెరాస నేతల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఎనిమిది మంది నేతల ఇళ్లలో తనిఖీలు చేశారు. దుబ్బాక జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ పుష్పలత కిషన్​రెడ్డి, దుబ్బాక మార్కెట్ కమిటీ ఛైర్మన్ బండి శ్రీలేఖ రాజు, ఆర్యవైస్య సమాజ అధ్యక్షుడు చింత రాజు, సిద్దిపేట మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, సూడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో ఏం దొరకలేదని వెనుతిరిగినట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.