చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని పల్లెలను,పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని 16వ వార్డులో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
జూన్ 1 నుంచి జూన్ 8 వరకు నిర్వహించనున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో తీవ్ర కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవ ఎనలేనిదని కొనియాడారు.