ETV Bharat / state

కిలోల కొద్దీ కుళ్లిన చికెన్ - బార్లకు ఇక్కడి నుంచే సరఫరా! - TASK FORCE RAIDS ON CHICKEN CENTER

బేగంపేట్ అన్నానగర్‌లో ఆహారభద్రత అధికారుల తనిఖీలు - అక్రమంగా నిల్వ ఉంచిన 600 కిలోల చికెన్‌ను గుర్తించిన అధికారులు - ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు చేసిన టాస్క్​ఫోర్స్, ఆహార భద్రత అధికారులు

safety officials
safety officials Inspections (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2025, 3:43 PM IST

Inspection By Food Safety Officer : సికింద్రాబాద్ బేగంపేట్​లోని అన్నానగర్​లో పలు చికెన్ సెంటర్లపై ఆహారభద్రత, టాస్క్​ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకుల ఏకంగా 600 కిలోల కుళ్లిన చికెన్​ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా కుళ్లి పాడైపోయిన స్థితిలో ఉన్న చికెన్​ను విక్రయించి లాభాలు సంపాదిస్తున్నారని వెల్లడించారు.

తక్కువ ధరలకే మద్యం షాపులకు సరఫరా : ఎస్ఎస్ఎస్, రవి చికెన్ దుకాణాలలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 600 కిలోల చికెన్​ను స్వాధీనం చేసుకున్నారు. రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంచిన కోళ్ల మాంసాన్ని అతి తక్కువ ధరలకే సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఆహారభద్రత, టాస్క్​ఫోర్స్ అధికారులు పాడైపోయిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో కుళ్లిన చికెన్ విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Inspection By Food Safety Officer : సికింద్రాబాద్ బేగంపేట్​లోని అన్నానగర్​లో పలు చికెన్ సెంటర్లపై ఆహారభద్రత, టాస్క్​ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకుల ఏకంగా 600 కిలోల కుళ్లిన చికెన్​ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా కుళ్లి పాడైపోయిన స్థితిలో ఉన్న చికెన్​ను విక్రయించి లాభాలు సంపాదిస్తున్నారని వెల్లడించారు.

తక్కువ ధరలకే మద్యం షాపులకు సరఫరా : ఎస్ఎస్ఎస్, రవి చికెన్ దుకాణాలలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచిన 600 కిలోల చికెన్​ను స్వాధీనం చేసుకున్నారు. రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంచిన కోళ్ల మాంసాన్ని అతి తక్కువ ధరలకే సమీపంలోని మద్యం దుకాణాలు, బార్లకు విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన ఆహారభద్రత, టాస్క్​ఫోర్స్ అధికారులు పాడైపోయిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో కుళ్లిన చికెన్ విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

డ్రైనేజ్​ పక్కనే కిచెన్, ఫ్రిజ్​లో కుళ్లిన మటన్ - తనిఖీ చేస్తూ షాకైన మేయర్

కుళ్లిన మాంసం, బూజుపట్టిన కూరగాయలు - మెదక్​ హోటళ్లలో అవాక్కయ్యే నిజాలు - Food Inspections In medak HOTELS

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.