సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన పంట మార్పిడి సదస్సులో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేల కోట్లు రైతుల కోసం వెచ్చించి.. వారు పండించిన పంటను కొంటుందని అన్నారు. రైతలు మేలు కోరి.. కేసీఆర్ పంట మార్పిడి విధానాన్ని సూచిస్తున్నారని తెలిపారు. నిరంతరం రైతుల బాగు కోసం ఆలోచించే నాయకుడు కేసీఆర్ అని.. రైతుబంధు, సాగునీరు, మద్ధతు ధర వంటి ఎన్నో పనులు చేసిన కేసీఆర్.. రైతులు ఇబ్బందుల పాలయ్యే ఏ పని చేయరని ఆయన నమ్మకాన్ని వెలిబుచ్చారు.
రైతులు పండించిన ప్రతి పంటకు ప్రభుత్వం మద్ధతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని.. అందుకే ఏ పంటలు వేయాలో రైతులకు సూచిస్తుందని అన్నారు. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తై.. గోదావరి జలాలతో హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.
ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు