సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తెరాస కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే సతీష్ కుమార్ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమ పార్టీగా ఏర్పడిన తెరాస అలుపెరుగని పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిందన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు గోదావరి జలాలు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు.
95 శాతం వరకు గౌరవెల్లి ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయన్న ఎమ్మెల్యే అతి త్వరలో మిగిలిన పనులు కూడా పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు. తెరాస అధినేత కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల సాధనకై నిరంతరం కృషి చేస్తామన్నారు.
ఇవీ చూడండి: గవర్నర్ తమిళిసైతో భాజపా ప్రతినిధుల బృందం భేటీ