ETV Bharat / state

'పుల్లూరు బండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం' - పుల్లూరు బండ జాతర

స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. త్వరలోనే కాళేశ్వరం నుంచి సిద్దిపేటకు నీళ్లు వస్తాయని తెలిపారు.

minister harish rao visited pulluru banda jathara in siddipet district
'పుల్లూరు బండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం'
author img

By

Published : Jan 24, 2020, 5:26 PM IST

'పుల్లూరు బండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం'
సిద్దిపేట జిల్లా పుల్లూరు బండలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మాఘ మాసం జాతరలో పవిత్ర స్నానాలు చేసే రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. పుల్లూరు బండ జాతర తెలంగాణ పల్లెల పండుగకు నిదర్శనమని పేర్కొన్నారు. పుల్లూరుబండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

'పుల్లూరు బండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం'
సిద్దిపేట జిల్లా పుల్లూరు బండలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మాఘ మాసం జాతరలో పవిత్ర స్నానాలు చేసే రోజున స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. పుల్లూరు బండ జాతర తెలంగాణ పల్లెల పండుగకు నిదర్శనమని పేర్కొన్నారు. పుల్లూరుబండను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

Intro:TG_SRD_71_24_HARISH_SCRIPT_TS10058

యాంకర్: స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేస్తుంది ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. అతి త్వరలో కాళేశ్వరం నుండి సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు వస్తాయని అప్పుడు రైతులు రెండు పంటలు పండుతాయని రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని హరీష్రావు అన్నారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామం లో స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు ముఖ్య అతిథిగా వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్వాగతం తోరణాన్ని ప్రారంభించారు.


Body:ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.... మాఘ మాస జాతరలో ఈ పవిత్ర స్నానాలు చేసే రోజున స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పుల్లూరు బండ జాతర తెలంగాణ పల్లెల పండుగకు జాతరకు నిదర్శనం. పుల్లూరు బండ ను ఆధ్యాత్మికంగా పర్యాటకంగా మరింత తీర్చిదిద్దుతాం. వచ్చే భక్తుల విడితి కి కాటేజెస్ నిర్మిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా ఆలయాలు అఖిల రిజర్వాయర్ల జిల్లాగా మారబోతున్నారు.


Conclusion:కొద్ది రోజుల్లోనే పుల్లూరు బండ ను గోదావరి జలాలు రానున్నాయి. స్వామి పాదాల చెంతకు వస్తాయి. గోదావరి నీళ్లతో లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకం చేద్దామన్నారు. మరి నీ నిధులతో పుల్లూరు బండ ను మరింత అభివృద్ధి చేస్తామని ఎల్లవేళలా స్వామి దీవెనలు మనపై ఉంటాయని హరీష్ రావు అన్నారు.

బైట్: హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.