సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలంలోని రాఘవాపూర్ గ్రామ పెద్ద చెరువు.. కాళేశ్వరం నీళ్లతో జలకళ సంతరించుకుంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరు అందించేందుకు కాళేశ్వరం కాలువల ద్వారా నీటిని వదిలారు. దీంతో ఐదు రోజులుగా వస్తున్న ఆ నీళ్లతో చెరువు నిండి అలుగు పారింది.
ఈ సంతోషంలో చెరువుకు మంత్రి హరీశ్ రావు జల హారతి చేపట్టారు. అనంతరం గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చెరువు నిండి అలుగు పారడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్లో విచారణ