సిద్దిపేట జిల్లా మార్కు మండలం చేబర్తి చెరువులోకి కాళేశ్వరం కాలువ ద్వారా గోదావరి నీటిని అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి నీటిని విడుదల చేశారు. అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో చేబర్తి చెరువులోకి కాళేశ్వరం కాలువ నుంచి గోదావరి నీటిని విడుదల చేసి చెరువులు, చెక్ డ్యాంలు నిర్మించాలని సీఎం కేసీఆర్ చేబర్తి సర్పంచ్కు సూచించారు.
గ్రామస్థుల హర్షం...
సీఎం సూచనల మేరకు కాళేశ్వరం కాల్వ నీటి వద్ద వేద పండితులచే పూజలు నిర్వహించిన అనంతరం గోదావరి నీటిని చెరువులోకి విడుదల చేశారు. అంతకుముందు గ్రామస్థులంతా డప్పు చప్పుళ్ల బోనాలతో కాళేశ్వరం కాల్వ వద్దకు చేరుకున్నారు. నీటి విడుదల అనంతరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి : 'నచ్చిన పంట సాగు చేసుకునే స్వేచ్ఛ రైతులకు లేదా?'