సిద్దిపేట జిల్లా దుబ్బాకలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ రావు పర్యటించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో... 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని 546 మహిళ సంఘాలకు 17కోట్ల 58లక్షల 8వేల రూపాయల చెక్కులు అందించినట్టు మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాకే... దుబ్బాక ప్రజల నీటి గోస తీరిందని హరీశ్ వ్యాఖ్యానించారు. మైళ్ల కొద్ది వెళ్లి మహిళలు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి మారిందన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో గోపాల్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భారీ వర్షాలున్నాయ్... అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్