ETV Bharat / state

వ్యాక్సిన్​ పంపిణీకి ఏర్పాట్లు చేయండి : కలెక్టర్​

author img

By

Published : Dec 29, 2020, 7:58 PM IST

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని సిద్దిపేట జిల్లా పాలనాధికారి వెంకట్రామరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి మొదటి విడతలోనే వ్యాక్సిన్ అందిస్తామన్నారు. దీనిపై కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

collector review on distribution of vaccine in siddipeta district
వ్యాక్సిన్​ పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి : కలెక్టర్​

త్వరలో అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామరెడ్డి సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీకి వైద్యారోగ్యశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యాక్సిన్​ పంపిణీకి సంబంధించి కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. వాక్సిన్‌ స్టోరేజీ, పంపిణీకి సంబంధించిన కార్యాచరణ ముందే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

వైద్య సిబ్బందికే తొలి ప్రాధాన్యం...

తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్​ అందిస్తామని పాలనాధికారి స్పష్టం చేశారు. రెండో విడతలో పోలీస్​శాఖ, పారిశుద్ధ్య, అంగన్​వాడీ సిబ్బందికి... మూడో దశలో 50 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు.

యూట్యూబ్​లో ప్రచారం చేయండి...

వ్యాక్సిన్​ పంపిణీ సజావుగా జరిగేలా డివిజన్, మండల , గ్రామస్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. వాక్సిన్‌పై అపోహాలు తొలగించేలా నగరాల్లోను, గ్రామాల్లోను విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. సిద్దిపేట విద్యామిత్ర యూట్యూబ్ ఛానెల్​ ద్వారా కోవిడ్‌ వాక్సినేషన్‌ ప్రోగ్రామ్, ప్రాధాన్యత క్రమంలో వాక్సినేషన్ పంపిణీపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి... వారిని చైతన్యవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:'కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయండి'

త్వరలో అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీలో అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్​ వెంకట్రామరెడ్డి సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీకి వైద్యారోగ్యశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. వ్యాక్సిన్​ పంపిణీకి సంబంధించి కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. వాక్సిన్‌ స్టోరేజీ, పంపిణీకి సంబంధించిన కార్యాచరణ ముందే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

వైద్య సిబ్బందికే తొలి ప్రాధాన్యం...

తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సిన్​ అందిస్తామని పాలనాధికారి స్పష్టం చేశారు. రెండో విడతలో పోలీస్​శాఖ, పారిశుద్ధ్య, అంగన్​వాడీ సిబ్బందికి... మూడో దశలో 50 సంవత్సరాలు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్దేశించిందని తెలిపారు.

యూట్యూబ్​లో ప్రచారం చేయండి...

వ్యాక్సిన్​ పంపిణీ సజావుగా జరిగేలా డివిజన్, మండల , గ్రామస్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలన్నారు. వాక్సిన్‌పై అపోహాలు తొలగించేలా నగరాల్లోను, గ్రామాల్లోను విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. సిద్దిపేట విద్యామిత్ర యూట్యూబ్ ఛానెల్​ ద్వారా కోవిడ్‌ వాక్సినేషన్‌ ప్రోగ్రామ్, ప్రాధాన్యత క్రమంలో వాక్సినేషన్ పంపిణీపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి... వారిని చైతన్యవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:'కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.