అయోధ్య రామమందిర నిర్మాణ విషయంలో.. పరకాల ఎమ్మెల్యే ధర్మా రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
అనుచిత వ్యాఖ్యలు..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన ఈ ఆందోళనలో రామ మందిర నిర్మాణ నిధి విషయమై ఎమ్మెల్యే.. అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంటని ప్రశ్నించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని.. ఖమ్మంలోని భద్రాద్రి రామ మందిరంతో పోలుస్తూ తెరాస ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:నడిరోడ్డుపైనే లంచం తీసుకున్న ఏఈ.. అరెస్టు చేసిన పోలీసులు