ETV Bharat / state

బాబా పేరుతో ఆశ్రమం.. వచ్చిన మహిళపై అత్యాచారయత్నం - బాబా, తన అనుచరుడు అత్యాచారయత్నం చేశారంటూ మహిళ ఫిర్యాదు

బాబా ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళకు మాయ మాటలు చెప్పారు. అదే అదునుగా తీసుకుని బాబా, అతని అనుచరుడు అత్యాచారయత్నం చేశారు. సంవత్సరం నుంచి తనను మోసం చేశారని బాధితురాలు చెబుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం​లో చోటుచేసుకుంది.

Ashram in the name of Baba Rape attempt on woman came at cheekode siddipet
బాబా పేరుతో ఆశ్రమం.. వచ్చిన మహిళపై అత్యాచారయత్నం
author img

By

Published : Jul 11, 2020, 6:44 PM IST

ఆశ్రమం నడుపుతున్న బాబా, తన అనుచరుడు అత్యాచారయత్నం చేశారంటూ ఓ మహిళా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చికోడ్ శివారులో బాబా ఆశ్రమంలోని బాబా, అతని అనుచరుడు అత్యాచారయత్నం చేశారంటూ బాధిత మహిళ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ధర్మాజీపేటకు చెందిన రఘు ఇంటర్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా బాబా అవతారమెత్తి రఘు అలియాస్ సమర్థ సాయిగా పిలువబడుతున్నాడు. చికోడ్ గ్రామ శివారులో గత కొన్నేళ్లుగా సాయి సమర్థ ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన అనుచరుడు నరేష్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు భక్తి మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. దుబ్బాక సర్కిల్ ఇన్​స్పెక్టర్ హరికృష్ణ గౌడ్ నిందితులు నరేష్, రఘు బాబాపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాబా అనుచరుడు నరేష్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామని, బాబా పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.

బాబా పేరుతో ఆశ్రమం.. వచ్చిన మహిళపై అత్యాచారయత్నం

ఇదీ చూడండి : కరోనా రోగులకు వైద్యం అందడం లేదు: భట్టి

ఆశ్రమం నడుపుతున్న బాబా, తన అనుచరుడు అత్యాచారయత్నం చేశారంటూ ఓ మహిళా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చికోడ్ శివారులో బాబా ఆశ్రమంలోని బాబా, అతని అనుచరుడు అత్యాచారయత్నం చేశారంటూ బాధిత మహిళ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ధర్మాజీపేటకు చెందిన రఘు ఇంటర్ పూర్తి చేశాడు. కొన్ని రోజులుగా బాబా అవతారమెత్తి రఘు అలియాస్ సమర్థ సాయిగా పిలువబడుతున్నాడు. చికోడ్ గ్రామ శివారులో గత కొన్నేళ్లుగా సాయి సమర్థ ఆశ్రమం నడుపుతున్నాడు. ఈ క్రమంలో తన అనుచరుడు నరేష్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు భక్తి మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. దుబ్బాక సర్కిల్ ఇన్​స్పెక్టర్ హరికృష్ణ గౌడ్ నిందితులు నరేష్, రఘు బాబాపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాబా అనుచరుడు నరేష్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించామని, బాబా పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.

బాబా పేరుతో ఆశ్రమం.. వచ్చిన మహిళపై అత్యాచారయత్నం

ఇదీ చూడండి : కరోనా రోగులకు వైద్యం అందడం లేదు: భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.