ETV Bharat / state

కుటుంబ కలహాలతో సెల్​టవర్​ ఎక్కిన యువకుడు - A young man climbing a cell tower in Siddipet to commit suicide

కుటుంబ కలహాలతో ఓ యువకుడు సెల్​టవర్ ఎక్కి మూడు గంటల పాటు హల్​చల్​ చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​ పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది.

ఆత్మహత్య చేసుకుంటానంటూ సిద్దిపేటలో సెల్​టవర్​ ఎక్కిన యువకుడు
author img

By

Published : Nov 24, 2019, 7:56 PM IST

తన కుటుంబ సభ్యులు డబ్బుకోసం తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని... తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్​టవర్​ ఎక్కాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన సోమేశ్ తన కుటుంబ సభ్యులు తనపై కేసు పెట్టారని.. తన భార్యను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఆత్మహత్య చేసుకుంటానని సెల్​టవర్​ ఎక్కాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. ప్రజ్ఞాపూర్​ మున్సిపల్​ మాజీ ఛైర్మన్​ భాస్కర్​, గజ్వేల్​ జడ్పీటీసీ మల్లేశం ఘటనా స్థలికి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి మాటలతో సోమేశ్​ కిందకి దిగొచ్చాడు.

తన తండ్రి పిసప్ప, పిన తల్లి యాదమ్మలు ఆస్తి కోసం తనను హత్యచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించాడు. తప్పుడు కేసుతో అరెస్టుచేయిస్తున్నారని వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు.

ఆత్మహత్య చేసుకుంటానంటూ సిద్దిపేటలో సెల్​టవర్​ ఎక్కిన యువకుడు

ఇదీ చూడండి: అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్ కింద పడి బాలుడు మృతి

తన కుటుంబ సభ్యులు డబ్బుకోసం తనను అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని... తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఓ యువకుడు సెల్​టవర్​ ఎక్కాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన సోమేశ్ తన కుటుంబ సభ్యులు తనపై కేసు పెట్టారని.. తన భార్యను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఆత్మహత్య చేసుకుంటానని సెల్​టవర్​ ఎక్కాడు. కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబ సభ్యులతో మాట్లడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. ప్రజ్ఞాపూర్​ మున్సిపల్​ మాజీ ఛైర్మన్​ భాస్కర్​, గజ్వేల్​ జడ్పీటీసీ మల్లేశం ఘటనా స్థలికి వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వారి మాటలతో సోమేశ్​ కిందకి దిగొచ్చాడు.

తన తండ్రి పిసప్ప, పిన తల్లి యాదమ్మలు ఆస్తి కోసం తనను హత్యచేసేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించాడు. తప్పుడు కేసుతో అరెస్టుచేయిస్తున్నారని వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు.

ఆత్మహత్య చేసుకుంటానంటూ సిద్దిపేటలో సెల్​టవర్​ ఎక్కిన యువకుడు

ఇదీ చూడండి: అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్ కింద పడి బాలుడు మృతి

Intro:tg_srd_16_24_cell_tower_akkina_yuvakudu_av_ts10054
కుటుంబ కలహాలతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి మూడు గంటల పాటు హల్చల్ చేసిన సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చోటుచేసుకుందిBody:సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన సోమేశ్ తనపై తన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తనను తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నారని పట్టణంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నం చేశాడు తనకు న్యాయం జరిగే వరకు మొండికేసి కూర్చున్నారు లేదంటే ఇక్కడి నుంచి దూకి చనిపోతున్నారు కుటుంబ సభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అతను వినలేదు విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ గజ్వేల్ జడ్పిటిసి సభ్యులు మల్లేశం లు లు సమస్య పరిష్కారమయ్యే వరకు మీ వెంటే ఉంటామని హామీ ఇవ్వడంతో బాధితుడు దిగివచ్చాడు దీంతో పోలీసులు కుటుంబ సభ్యులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఈ సందర్భంగా సోమేశ్ మాట్లాడుతూ తన తండ్రి పిసప్ప, పిన తల్లి యదమ్మ లు ఆస్తి కోసం నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇంట్లో నుంచి డబ్బులు దొంగలించ నని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో పాటు తన భార్య అత్తమ్మ లను తరచు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని తెలిపారుConclusion:గజ్వేల్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.