సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో వీఆర్వోల నుంచి తహశీల్దార్లు పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. రెవిన్యూశాఖను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు వీఆర్వోల నుంచి దస్త్రాలన్నీ స్వాధీనం చేసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం వల్ల సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్, మనురు, నాగలిగిద్ద, సిర్గాపూర్ మండలాల పరిధిలోని వీఆర్వోల నుంచి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో తహశీల్దార్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వోలు రికార్డులు అప్పగించిన విషయాన్ని జిల్లా అధికారులకు సమాచారం అందించినట్టు తహశీల్దార్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ను దత్తత తీసుకున్న ప్రభాస్