ETV Bharat / state

'చెత్త నుంచి సంపద సృష్టించడమే లక్ష్యంగా పనిచేయాలి' - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

చెత్త నుంచి గ్రామ పంచాయతీలకు సంపద సృష్టించడమే లక్ష్యంగా ఎంపీడీవోలు, సర్పంచులు పనిచేయాలని జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రకృతి వనాలు, చెత్త నుంచి ఎరువుల తయారీ షెడ్ల నిర్వహణపై డివిజన్ స్థాయి సమీక్ష నిర్వహించారు.

zp ceo review
'చెత్త నుంచి సంపద సృష్టించడమే లక్ష్యంగా పనిచేయాలి'
author img

By

Published : Aug 10, 2020, 5:15 PM IST

ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం, చెత్త నుంచి ఎరువుల తయారీ నిరంతరం జరగాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలపరిషత్​ కార్యాలయంలో చెత్త నుంచి ఎరువుల తయారీ షెడ్లనిర్వహణపై డివిజన్​ స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీ నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలని తెలిపారు.

పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠధామం నిర్మాణం, వంద శాతం పన్ను వసూలు జరిగేలా చూడాలని అన్నారు. సమావేశంలో జహీరాబాద్ మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్, కోహిర్, రాయికోడ్ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం, చెత్త నుంచి ఎరువుల తయారీ నిరంతరం జరగాలని జడ్పీ సీఈవో ఎల్లయ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలపరిషత్​ కార్యాలయంలో చెత్త నుంచి ఎరువుల తయారీ షెడ్లనిర్వహణపై డివిజన్​ స్థాయి సమీక్ష నిర్వహించారు. పంచాయతీ నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలని తెలిపారు.

పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠధామం నిర్మాణం, వంద శాతం పన్ను వసూలు జరిగేలా చూడాలని అన్నారు. సమావేశంలో జహీరాబాద్ మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్, కోహిర్, రాయికోడ్ మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: బైరామల్​గూడ పైవంతెనను ప్రారంభించిన కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.